దేశం లో ఎన్నెన్నో అమానుష ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. ముఖ్యంగా మహిళల పై వరుస దాడులు జరుగుతున్నాయి.. ఈ విషయం పై ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. అమాయికులైన అమ్మాయిల పై మగ పురుగులు కామవంచన తీర్చుకుంటున్నారు. బయట వాళ్ళ సంగతి పక్కన పెడితే ఇంట్లో వాళ్ళే, అయిన వాళ్ళే తోడేళ్ళులాగా పీక్కుతింటూన్నారు.. ఇది నిజంగా సిగ్గుపడే విషయం అనే చెప్పాలి. ఇప్పుడు మరో దారుణం వెలుగు చూసింది. సొంత మరదలు స్నానం చేస్తున్నప్పుడు వీడియో తీసాడు.. దాన్ని అడ్డుగా పెట్టుకొని బెదిరించి అతి ఘోరంగా అత్యాచారం చేసాడు.


వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ సంఘటన పూణే లో చోటు చేసుకుంది. పూనె లోని పర్భానీ జిల్లాకు చెందిన నిందితుడిపై శనివారం బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా హింజేవాడి పోలీసుల కు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం తానూ స్నానం చేస్తున్నా సమయం లో దొంగగా వీడియో చిత్రీకరన చేసినట్లు ఆమె ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఆ వీడియోను ప్రతి సారి చూపించి అతనికి కోరిక తీర్చాలని బలవంతం చేసినట్లు చెప్పింది. అందుకు ఒప్పుకోక పోవడంతో విచక్షణా రహితంగా కొట్టి బలవంతంగా అత్యాచారం చేసినట్లు వాపొయింది.


ఘటన గత నెల లో జరిగింది. అప్పటికి ఈ విషయాన్ని ఆమె భయంతో ఎవ్వరికీ చెప్పలేదు. అయితే, ఆ వ్యక్తి తనను మరోసారి వేధించడం ప్రారంభించే సరికి ఆమెకు ఏం చేయాలో తెలియక, తల్లి,దండ్రులకు చెప్పింది. అలాగె భర్తకు కూడా చెప్పింది. ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాధు చేశారు. భాధిథురాలి వివరాలు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతణ్ణి పట్టుకునే పనిలో వున్నారు. అతను ఆ ఊరు విడిచి పారి పోయినట్లు తెలుస్తుంది. అతన్ని త్వరలొనె పట్టుకుంటామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: