మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా కానరాడే మానవత్వం ఉన్నవాడు.. ఈ పాట దాదాపు అందరూ వినే ఉంటారు. అయితే ఈ పాటలోని ప్రతి లిరిక్ కూడా ప్రస్తుతం ఈ రోజుల్లో మనుషులు మారుతున్న పేరు కు నిదర్శనంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనిషి ఇక ఇప్పుడు ఆ మానవత్వాన్ని మరిచి పోతున్నాడు. ఒకప్పుడు ఎవరైనా ప్రమాదంలో ఉంటే మానవత్వాన్ని చూపిస్తూ సహాయం చేసే మనిషి ఇక ఇప్పుడు మాత్రం ఎవరు ఎటు పోతే మనకెందుకు అని అనుకుంటున్నాడు. అంతే కాదు ఏకంగా సాటి మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వడం లేదు.


 చిన్నచిన్న కారణాలకే సాటి మనుషుల ప్రాణాలు తీసేస్తూ దారుణంగా హత్య లకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. దొంగతనం చేయాలనే ఆలోచన ఆ మహిళను హంతకురాలిగా మార్చింది. అభం శుభం తెలియని చిన్నారిని దారుణంగా హతమార్చింది. సాధారణంగా ఎవరికైనా చిన్నపిల్లలనూ చూస్తే ఎత్తుకుని ముద్దు చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇక చిన్నారులు  ఎంతో ముద్దు ముద్దు గా మాట్లాడుతూ ఉంటే చూసి ప్రతి ఒక్కరు మురిసిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం దారుణంగా వ్యవహరించింది.



 చిన్నారి ప్రాణాలు తీసిన ఈ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. 4 ఏళ్ల చిన్నారిని పొరుగున ఉండే ఓ మహిళ దారుణంగా ప్రాణాలు తీసింది. ఫాతిమా అనే మహిళ ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో చిన్నారి ఒంటరిగా ఉండటం తో ఒంటిపై బంగారాన్ని దొంగిలించింది. ఇక అనంతరం ఆ బాలుడి నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా హతమార్చింది. మృతదేహాన్ని తన ఇంట్లో ఉన్న బీరువాలో దాచేసింది సదరు మహిళ. అయితే ఇక కొడుకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడం తో అసలు విషయం బయటకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: