నేటి రోజుల్లో ఆడపిల్లలకి అసలు రక్షణ లేదా అంటే ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న ఘటనలు  చూస్తూ ఉంటే మాత్రం ఆడపిల్లలకు రక్షణ ఉంది అని ఎవరు చెప్ప లేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఆడపిల్ల తమ ఇంట్లోనే అమ్మ చెల్లి లాంటి వారే అని భావించడం లేదు ఎవరు. కను చూపు మేరలో ఆడపిల్ల కనిపించిందంటే చాలు దారుణం గా అత్యాచారానికి పాల్పడుతూన్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వస్తున్నాయి. అయితే ఆడ పిల్లలపై   అత్యాచారానికి పాల్పడిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో  మాత్రం మార్పు రావడం లేదు.


 దీంతో మహిళలు అడుగడుగునా భయ పడుతూ బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడు తున్నాయి.. పసి పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదలడం లేదు కామాంధులు. మానవత్వమున్న మనుషులు కాస్త మానవ మృగాలుగా మారి పోయి పశువుల్లా ప్రవర్తిస్తూ ఉండడం గమనార్హం. అత్యాచారాలు చేయడమే కాదు దారుణం గా ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా వెలుగు లోకి వస్తున్నాయి. దీంతో ఆడపిల్ల అనుక్షణం భయ పడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. కామం తో ఊగి పోయిన ఓ యువకుడు 13 ఏళ్ల బాలిక జీవితాన్ని నాశనం చేశాడు. దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో వెలుగులోకి వచ్చింది. మహమ్మద్ మోహిజ్ అనే యువకుడు హైదరాబాద్లోని అక్క ఇంట్లో ఉంటున్నాడు. పక్కింట్లో ఉంటున్న 13 ఏళ్ల బాలికపై అతడి కన్నుపడింది.  కోరిక తీర్చుకోవాలి అనుకున్నాడు. సమయం కోసం ఎదురు చూసాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో షాకైనా తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: