చదువుపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో న్యూఢిల్లీలోని తన ఇంటి నుండి పారిపోయిన 14 ఏళ్ల బాలిక, మహారాష్ట్రలోని తన కుటుంబంతో తిరిగి కలిసింది. ఎలా అంటే ఆటో రిక్షా డ్రైవర్ వెంటనే పోలీసులను అప్రమత్తం చేసినట్లు అధికారి తెలిపారు.
త్రీవీలర్ డ్రైవర్ వెంటనే ట్రాఫిక్ పోలీసును అప్రమత్తం చేసి, బాలికను మానిక్పూర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడని అధికారి తెలిపారు. తాను న్యూఢిల్లీలోని పుష్ప్ విహార్కి ప్రాంతానికి చెందిన దాన్ని అని చదువుపై దృష్టి పెట్టాలని తల్లి ఒత్తిడి చేయడంతో శుక్రవారం ఇంటి నుంచి పారిపోయానని బాలిక పోలీసులకు తెలిపిందని ఆయన తెలిపారు. ఇక్కడి పోలీసులు ఢిల్లీలోని సాకేత్ పోలీస్ స్టేషన్ను సంప్రదించారు. అక్కడ బాలిక తల్లిదండ్రులు కిడ్నాప్ ఆరోపణలపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు బాలిక తల్లిదండ్రులకు ఆచూకీ తెలియజేశారు. దింతో బాలిక తల్లిదండ్రులు విమానంలో వెంటనే వసాయ్ చేరుకున్నారు. అక్కడ వారు శనివారం సాయంత్రం తమ కుమార్తెతో తిరిగి కలిశారని మాణిక్ పూర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ బహు సాహెబ్ తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఆటో రిక్షా డ్రైవర్ను సన్మానించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి