యువతులపై అత్యాచారాలు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. కఠిన చట్టాలు కోర్టులు కఠిన శిక్షలు పోలీసులు ఎన్కౌంటర్లు అత్యాచారాలను మాత్రం ఆపలేక పోతున్నాయి.  రోజురోజుకు వెలుగులోకి వస్తున్న అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు అని చెప్పాలి. ఇటీవల కాలంలో  వెలుగులోకి వస్తున్న ఘటనలు  ఆడపిల్ల రక్షణకే ప్రశ్నార్థకంగా మారుతున్నాయి అని చెప్పాలి. కామపు కోరల్లో చిక్కుకోకుండా ఉండేందుకు ఆడపిల్లలు ఎంతలా జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా కామాంధులు  రెచ్చి పోతూ ఉండటం గమనార్హం.


 దీంతో ఆడపిల్ల ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తుందా లేదా అని తల్లిదండ్రులు కంగారు పడి పోతున్న పరిస్థితి నేటి రోజుల్లో నెలకొంది అని చెప్పాలి. ఇటీవల విజయవాడలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. అరండల్ పేట లోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ స్కూల్ ప్రమాదంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ ఆవరణలో ఎటు చూసినా మద్యం బాటిళ్లు కనిపించాయి. దీంతో తల్లిదండ్రులు అందరూ కూడా స్కూల్కి తమ పిల్లలను పంపించాలంటే హడలెత్తిపోతున్నారు. ఇటీవలే రోడ్డుపై వెళ్తున్న ఒక బాలికను బలవంతంగా స్కూల్ లోపలికి తీసుకువెళ్ళి ఆకతాయిలు దారుణంగా సదరు బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డారు.


 ఏకంగా అరగంటపాటు ఇక బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. అయితే చిన్నారి బాలిక కేకలు వేయడంతో చివరికి ఆకతాయిలు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఈ ఘటనలో ఆకతాయిలు  నుంచి తప్పించుకునే క్రమంలో సదరు బాలిక బట్టలు మొత్తం చిరిగిపోయి ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగింది అని ఆరా తీశారు. ఈ క్రమంలోనే  జరిగిన విషయం తెలిసి ఒక్కసారిగా షాకయ్యారు సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను  పట్టుకుని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: