ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లైన 24 గంటలు గడవక ముందే నన్ను అతను మోసం చేశాడంటూ యువతి అతని ఇంటి ముందు నిరసన తెలిపింది. ఇలా పెళ్లి బాజాలు మోగిన ఇంటిముందు ఓ యువతి నిరసనకు దిగిన ఘటన హైదరాబాద్ నగరంలోని హబ్సిగూడ వెలుగులోకి వచ్చి సంచలన గా మారిపోయింది. వివరాల్లోకి వెళితే.. వెంకట్ రెడ్డి నగర్ కు చెందిన శ్రీకాంతచారి తాను పదిహేనేళ్లుగా ప్రేమించుకుంటున్నామూ అంటూ రామంతాపూర్ కు చెందిన లక్ష్మీ అనే 29 ఏళ్ల యువతి తెలిపింది. ఇక తననే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని చెప్తూ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం తనను కాదని మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు అంటూ వాపోయింది.
ఇలా ప్రేమ పేరిట నమ్మించి మోసం చేసి మరొక వివాహం చేసుకున్న శ్రీకాంతచారి పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేయడం గమనార్హం. దీంతో బాధితురాలు నిందితుడు ఇంటి ముందు బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. ఇక సదరు బాధితురాలికి ఆదర్శ మహిళా సంఘం సభ్యులు మద్దతు తెలపడం గమనార్హం. చివరికి ఇక ఈ స్టోరీ ఉప్పల్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. లక్ష్మి కి న్యాయం జరిగేంత వరకూ పోరాటం ఆపేది లేదని మహిళా కమిషన్ సభ్యులు చెబుతుండడం గమనార్హం. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.