అక్రమ సంబంధం.. నేటి రోజుల్లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాట.  బంధాలు బంధుత్వాలు విలువ ఇవ్వని మనుషులు క్షణకాల సుఖం కోసం నీచాతి నీచమైన పనులకు పాల్పడుతున్నారు. చివరికి వావివరుసలు మరిచిపోయి  అక్రమ సంబంధాలకు తెరలేపుతున్నారు. అయితే ఇలా సుఖం కోసం పుడుతున్న అక్రమ సంబంధాలు చివరికి ప్రాణాలు పోయేంత వరకూ కూడా దారితీస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే.  కొంతమంది అక్రమ సంబంధాల నేపథ్యంతో ఆత్మహత్యలు చేసుకుంటే మరికొంతమంది దారుణంగా హత్యలకు పాల్పడుతున్నారు.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇక్కడ ఓ వ్యక్తి తన భార్యతో కలిసి అత్తారింటికి వెళ్లాడు. అక్కడ కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో ఆనందంగా గడిపాడు. ఈ క్రమంలోనే అందరూ నిద్రలోకి జారుకున్నారు. కానీ అర్ధరాత్రి సడన్ గా భార్య పక్కనుండి భర్త మాయమయ్యాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో అని తెలిసి ఒక్కసారిగా కుటుంబసభ్యులు అవాక్కయ్యారు అని చెప్పాలి.  ఈ ఘటన రాజస్థాన్ లోని బార్మార్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన కేరవా కు  చెందిన వ్యక్తికి కేన్రతీయకు చెందిన ఓ యువతితో ఏడాది క్రితం వివాహం జరిగింది.


 భార్య భర్తలు ఎంతో హాపీ గా ఉండే వారు. ఇటీవలే  భార్యతో కలిసి అత్తారింటికి వెళ్లాడు. అయితే రోజంతా అందరితో కలిసి సంతోషంగా గడిపాడు. ఇక రాత్రి నిద్ర పోయాక అర్ధరాత్రి  సడన్గా భర్త కనిపించలేదు. దీంతో కంగారుపడిన భార్య లేచి మిగతా వాళ్ళని కూడా నిద్రలేపింది. ఇక అదే సమయంలో ఇంట్లో ఆమె తల్లి కూడా కనిపించడం లేదన్న విషయాన్ని గుర్తించారు.  దీంతో వీరిద్దరు కలిసి ఎక్కడికి వెళ్లారు అని వెతకడం ప్రారంభించారు. తెల్లవారుజామున అతని భార్య కి ఒక సమాచారం అందింది   ఏకంగా తల్లి భర్త కలిసి ఒక చెట్టుకు ఉరి వేసుకున్నారు అని. దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అత్త అల్లుడు మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోందని అందుకే ఇలా ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: