సాధారణం  గా భార్యా భర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. కానీ ఇటీవల కాలం లో మాత్రం భార్య భర్తలు బద్ధ శత్రువుగా వ్యవహరిస్తోన్న పరిస్థితిలు వెలుగు  లోకి వస్తున్నాయి. కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండాల్సిన  వారు  ఏకం గా కట్టుకున్న వారిని కష్టపడుతున్న ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. అంతేకాదు తరచూ గొడవలు పడుతూ  ఒకరిని ఒకరు ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి గొడవలు నేటి రోజుల్లో దారుణ ఘటన లకు కారణమవుతున్నాయి.



 ఎన్నో ఘటనలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. భార్య తో గొడవ జరిగింది అనే కారణంతో భర్త బ్లేడు తో పొట్ట పైభాగం లో కోసుకున్నాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది అని చెప్పాలి.  మైసయ్య దేవమ్మ దంపతులు ఉపాధికోసం కొత్తూరు కి వలస వచ్చారు.  అయితే స్టేషన్ తిమ్మాపూర్ లో నివాసం ఉంటూ దినసరి కూలీలుగా పని చేస్తున్నారు ఇద్దరు. అయితే ఇటీవల ఇంటి వద్ద ఉన్న మైసయ్య మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పెట్టుకున్నాడు.



 ఈ క్రమం లో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగి  పోయిన మైసయ్య ఏకంగా ఒక కట్టెతో భార్య తలపై కొట్టాడు. అనంతరం బ్లేడుతో పొట్ట భాగం లో కోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. అయితే తీవ్ర రక్తస్రావం కావడం తో స్థానికులు వెంటనే అంబులెన్స్లో షాద్ నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అని తెలుస్తోంది. స్థానికంగా ఈ ఘటన సంచలనం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: