అయితే నేటి సభ్య సమాజంలో ఆడబిడ్డ పుట్టిన మగ బిడ్డ పుట్టిన ఎంతో సంతోషంగానే స్వీకరిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఒకప్పటిలా ఆడబిడ్డ పుట్టింది అనే కారణంతో చెత్తకుప్పల్లో పడేయడం సజీవంగా పాతి పెట్టడం లాంటి దారుణమైన ఘటన లు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి . కానీ ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది అన్నది మాత్రం వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఆడబిడ్డ పుట్టింది అనే కారణంతో భార్యను చిత్రహింసలకు గురిచేశాడు భర్త.
అస్సాంలో ఈ దారుణమైన ఘటన జరిగింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది అనే కారణంతో మహిళ చేత ఏకంగా యాసిడ్ తాగించాడు. మెట్టినింటి వారు భర్త అత్తమామలు కలిసి ఎంత బ్రతిమిలాడిన వినకుండా బలవంతంగా యాసిడ్ తాగించాడు. ఈ ఘటన సంచలనంగా మారగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన భర్త అత్తమామలు గత కొన్ని రోజులుగా శారీరకంగా హింసిస్తున్నారని స్నేహితులకు కుటుంబ సభ్యులకు సదరు మహిళా తెలిపినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు.