సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. మంచి జీతం.. సాఫీగా సాగిపోతున్న జీవితం.. దీంతో ఆ యువతి ఎంతో సంతోషంగానే ఉంది. కానీ ఊహించని విధంగా ఆ యువతి మనసులో పుట్టిన ప్రేమ ఆ యువతి జీవితాన్ని అతలాకుతలం చేసింది. ప్రేమ ఎప్పుడూ ఎవరి మధ్య పడుతుందో చెప్పలేము అని అంటూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో వెనకా ముందు ఆలోచించకుండా పుట్టిన ప్రేమ చివరికి ఎంతో మంది యువతుల జీవితాలను దుర్భరం చేసేస్తోంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.. ప్రేమ కారణంగా జీవితం ఇబ్బందుల్లో పడింది అని ఎంతగానో ఆవేదన చెందింది మహిళా టెక్కీ. దీంతో ఆత్మహత్య ఒక్కటే శరణ్యమని భావించింది. చివరికి ప్రేమ కారణంగా జీవితం దుర్భరంగా మారి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని దొడ్డబళ్ళాపురంలో  వెలుగులోకి. వచ్చింది నెలమంగల తాలూకా మధనాయకహల్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.


 గంగుండనహళ్లి నివాసి అయిన 25 ఏళ్ళ అనిత  ఐటీ ఉద్యోగం చేస్తుంది. ఇక మంచి జీతం కూడా వస్తుంది. కాగా జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇలాంటి సమయంలోనే తాను పనిచేస్తున్న కంపెనీలో టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్న ప్రదీప్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. తరచూ అతని టాక్సీ లోనే వెళ్తూ వస్తూ ఉండటంతో ఇద్దరి మనసులు కలిసాయ్. దీంతో వీరి మధ్య ప్రేమ పుట్టింది. ఆ తర్వాత ప్రదీప్ తో పెళ్లికి సిద్ధమైంది. ముందు వెనుక ఆలోచించకుండా  ఆలోచించకుండానే ప్రదీప్ ని పెళ్లి చేసుకుంది అనిత.  పెళ్లి తర్వాత జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని భావించింది.

 కానీ పెళ్లి అయిన ఆరు నెలలకే ప్రదీప్ నిజస్వరూపం బయటపడింది. కట్నం కావాలని భార్యను వేధించడం మొదలుపెట్టాడు. చివరికి అతనితో జీవించడం ఇష్టంలేక కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకుంది. ఇటీవలే కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. అయితే జీవితంలో తప్పటడుగులు వేసానని.. తన లైఫ్ పట్ల విరక్తి చెంది చివరికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విషయం తెలుసుకున్న ప్రదీప్ అతని తల్లిదండ్రులు పరారయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: