అయితే ఇలా మనస్పర్ధల తో విడి పోయి విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నా పర్వాలేదు. కానీ ఇటీవలి కాలం లో భార్య భర్తలు మరింత దారుణం గా వ్యవహరిస్తున్నారు. సుఖాల్లో తోడు ఉంటానని ప్రమాణం చేసిన వారే కట్టుకున్న వారిని దారుణం గా హత్య చేసిన ఘటన వెలుగు లోకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత నేటి రోజుల్లో యువత పెళ్లి పేరెత్తితేనే భయపడే పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.
భార్యను భర్త పిస్తోలుతో కాల్చి హత్య చేసిన దారుణమైన ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. కొడగు సోమవార పేట తాలూకా బెట్టల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. కిషన్ అలియాస్ గోపాల్ చస్మా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే దంపతులిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన కిషన్ తన వద్ద ఉన్న పిస్తోలు తో చస్మా పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.