ఇటీవలి కాలంలో మానవ బంధాల కు ఎవరు విలువ ఇవ్వడం లేదు అన్నది నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తే అర్థం అవుతుంది అని చెప్పాలి.. కట్టుకున్న వారితో కల కాలం కష్ట సుఖాల్లో తోడు ఉండాల్సిన వారు పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి దారుణంగా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు  ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి తరహా దారుణ ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తున్నాయి.  ముఖ్యంగా ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా ఎంతోమంది పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు.. కొంతమంది మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటే.. ఇంకొన్ని చోట్ల కట్టుకున్న వారిని  దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.



 ఇలా వివాహేతర సంబంధాలకు సంబంధించి రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవలే ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిపోయింది. ఒడిశాలోని కలహండి జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వింత ఘటన వెలుగు చూసింది. పెళ్లై పిల్లలు ఉన్న వ్యక్తి ఏకంగా హిజ్రా తో ప్రేమలో పడ్డాడు.  చివరికి భార్యకు తెలియకుండా  హిజ్రాతో చెట్టపట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టాడు. కానీ ఏదో ఒకరోజు నిజం బయట పడాల్సి ఉంది. కదా చివరికి ఇక హిజ్రా తో తన భర్త ప్రేమలో ఉన్నాడు అన్న విషయం భార్యకు తెలిసింది.


 ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది.. ఫకీర్ అనే వ్యక్తికి ఆరేళ్ళ క్రితం వివాహం జరగగా.. ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఏడాది క్రితం గ్రామానికి చెందిన సంగీత అనే హిజ్రాతో ప్రేమలో మునిగి తేలుతూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టాడు అన్న విషయం తెలుసుకున్న భార్య హిజ్రాతో మాట్లాడి తన భర్తతో ఇటీవల సాంప్రదాయబద్ధంగా గ్రామంలోని ఆలయంలో పెళ్లి చేయించింది. తాను ఫకీరునీ ప్రేమించానని ఇక అతని భార్య అర్థం చేసుకుని నాకు కొత్త జీవితం ప్రసాదించింది అంటూ హిజ్రా చెబుతుండడం గమనార్హం. స్థానికంగా సంచలనం గా మారిపోయింది ఈ ఘటన.

మరింత సమాచారం తెలుసుకోండి: