ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు ఎన్నో ప్రాణాలు పోవడానికి కారణం అవుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కట్టుకున్న వారిని కాదని పరాయి వ్యక్తుల మోజులో పడిపోతున్న ఎంతోమంది చివరికి దారుణ హత్యలకు గురవుతున్నారు. లేదా ఏకంగా కట్టుకున్న వారిని దారుణంగా హత్య చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. వెరసి కష్టసుఖాల్లో తోడుంటారు అనుకున్న వారే చివరికి దారుణంగా హత మారుస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 అయితే యువతి యువకులు ప్రేమించుకోవడం ఇక ఆ తర్వాత పెద్దలు వారి ప్రేమను అంగీకరించలేక వేరొకరితో వారికి వివాహం జరిపించడం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇక కట్టుకున్న వారితో సజావుగా ఉండడం మానేసి ఇక పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మాజీ ప్రియుడుతో మళ్ళీ అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్న వారు కూడా నేటి రోజుల్లో చాలామంది కనిపిస్తున్నారు అని చెప్పాలి. చివరికి ఎప్పుడో ఒకసారి రహస్యంగా ఉన్న వీరి బంధం గురించి అసలు నిజం బయటపడి దారుణాలు జరిగిపోతూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.


 తాను ప్రేమించిన ప్రియురాలికి పెళ్లయిపోయింది. కానీ పెళ్లి తర్వాత కూడా అతను ఆమెతో బంధాన్ని కొనసాగించాడు. భర్త లేని సమయంలో ఆమెతో రాసలీలలు కొనసాగించేవాడు. ఇక ఇటీవలే భర్త లేని సమయంలో ప్రియురాలు ఇంటికి వచ్చాడు. కానీ అకస్మాత్తుగా భర్త ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అతనికి దొరకకుండా తప్పించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. విజయనగరం జిల్లాకు చెందిన ఆర్ఎస్ నాయుడు ఇంటర్ చదివే టైంలోనే ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆరేళ్ల క్రితం ఒక అధ్యాపకుడితో పెళ్లయింది. అయితే ఇటీవల భర్త లేని సమయంతో ఇంటికి వెళ్లి మాట్లాడాడు ఆర్ఎస్ నాయుడు. అయితే అంతలోనే భర్త రావడంతో బాల్కనీ నుంచి కిందకు దిగే ప్రయత్నంలో చివరికి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: