ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఘటనలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. కామంతో కళ్ళు మూసుకుపోతున్న మానవ మృగాలు ఆడపిల్ల కనిపించిందంటే చాలు దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆడపిల్ల ధైర్యంగా ఇంటి నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు ఇక ఇంట్లో వాళ్ళ నుంచి కూడా లైంగిక వేధింపులు ఎదురవుతున్న నేపథ్యంలో దుర్భర జీవితాన్ని గడుపుతుంది ఆడపిల్ల.


 ఇకపోతే ఇటీవల కాలంలో ఆడపిల్లలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేందుకు అన్ని ప్రభుత్వాలు కూడా కొత్త చట్టాలను తీసుకువచ్చాయి అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఇలాంటి కేసుల్లో అటు కోర్టులు కూడా కఠినమైన శిక్షలు విధిస్తూ ఉండడం గమనార్హం. ఇక బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి ఏకంగా జీవిత ఖైదు విధించింది కోర్టు. బాలిక తల్లితో కలిసి దుర్గి మండలంలోని ఒక గ్రామంలో నివసిస్తున్నారు. బాలిక మూడో తరగతి చదువుతుంది. అత్త ఇంటికి వెళ్లి వస్తానని తల్లికి చెప్పి అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అంజి ఆటోలో ఎక్కింది.


 అయితే అంజి బాలికను మొక్కజొన్న పొలం వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. తర్వాత బాలికను బంధువుల ఇంటి వద్ద దింపేసాడు. అయితే బాలిక అనారోగ్యం బారిన పడటంతో అదే రోజు సాయంత్రం తల్లి వద్దకు వచ్చేసింది. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని అంజి బెదిరించడంతో భయపడి తల్లికి విషయం చెప్పలేదు.  కానీ ఆ తర్వాత రోజే బాలిక నీరసంగా కనిపించడంతో ఏం జరిగిందని అడిగితే.. లైంగికదాడి విషయాన్ని చెప్పింది. దీంతో తల్లి వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అంజిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం రుజువు అయింది. దీంతో కోర్టులో హాజరు పరిచారు. కాగా కోర్టు విచారణ సమయంలో బాలిక అభివృద్ధి చెందింది. ఇక బాలిక కుటుంబానికి నాలుగు లక్షల పరిహారంతో పాటు నిందితుడికి జీవిత ఖైదు, 3500 జరిమానా విధించింది కోర్టు..

మరింత సమాచారం తెలుసుకోండి: