అయితే ఇలా పెళ్లి విషయంలో అమ్మాయిలు కోటి ఆశలను పెట్టుకుంటారు అన్నది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు పెళ్లి అనేది ఎంతో మంది అమ్మాయిలకు కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది. కొంతమంది ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. వయస్సును కూడా చూడకుండా తమకంటే చాలా పెద్ద వయసు ఉన్న వారిని కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకొంతమంది పెళ్లి అనే పేరుతో అందిన కాడికి దోచుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు అక్క చెల్లెలు ఇలాంటిదే చేశారు.
అన్నదమ్ములను పెళ్లి చేసుకున్నారు అక్క చెల్లెలు. కానీ చివరికి అత్తారింటికి కన్నం వేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ లో వెలుగులోకి వచ్చింది. భరత్ గుప్తా, రోహిత్ గుప్తలకు యూపీ గోరక్పూర్ కు చెందిన సంజన, అంజలితో ఈనెల 11వ తేదీన వివాహం జరిగింది. అయితే ఇటీవల కుటుంబ సభ్యుల కళ్ళు కప్పి 2.5 లక్షలు నగదు, బంగారు నగలతో నవ వధువులు ఇద్దరు కూడా పారిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు అని చెప్పాలి. వెంటనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వరుడి కుటుంబ సభ్యులు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి