అయితే మద్యానికి ఒక లిమిట్ లో తాగడం వరకు ఓకే గాని.. కొంతమంది అయితే మద్యానికి బానిసగా మారిపోయి కుటుంబ బాధ్యతలను కూడా గాలికి వదిలేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వెరసి ఇలా మద్యం కారణంగానే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయ్ అని చెప్పాలి. ఎన్నో ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త మద్యానికి బానిసగా మారిపోయాడు. ఈ క్రమంలోనే భర్త తో మద్యం మాన్పించాలని ఆమె ఎంతగానో ప్రయత్నించింది.
కానీ ఎంత చెప్పినా భర్త తీరులో మాత్రం మార్పు రాలేదు. దీంతో మనస్థాపం చెందిన భార్య చివరికి తనువు చాలించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస నగర్కు చెందిన నరేష్, లక్ష్మీ భార్యాభర్తలు. కాగా నరేష్ కూరగాయల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అయితే ఇటీవల కాలంలో మద్యానికి బానిసగా మారాడు. ఇక వ్యాపారం చేయగా వచ్చిన డబ్బుతో మద్యం సేవిస్తూ ఉండేవాడు. అయితే భార్యాభర్తల మధ్య ఇదే విషయంపై గొడవ జరుగుతూ ఉండేది. అయితే పెద్దల మధ్య పంచాయతీ పెట్టిన నరేష్ తీరులో మార్పు రాలేదు. కాగా భర్త తీరుతో విసుగు చెందిన భార్య లక్ష్మి చివరికి ఆత్మహత్య చేసుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి