ఇటీవల కాలం లో వెలుగు లోకి ఘటనలు చూసిన తర్వాత మనిషి ప్రాణం ఎప్పుడూ ఎలా పోతుంది అని ఊహకందని విధం గానే మారి పోయింది అని చెప్పాలి. ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య వస్తే లేదంటే ఇంకా ఏదైనా ప్రమాదం జరిగితేనో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని అందరూ నమ్మేవారు. కానీ ఇటీవల అనుహ్యమైన రీతిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఇలాంటి తరహా ఘటన సోషల్ మీడియా లో వెలుగు లోకి వస్తూ ప్రతి ఒక్కరిని కూడా అవ్వక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 ఇటీవల గుజరాత్ గాంధీనగర్ జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మనిషి స్వార్థపూరితంగా ఆలోచిస్తూ.  ఇక అడవులను నరికేస్తూ భవనాలను నిర్మిస్తూ ఉన్నాడు. దీంతో అడవుల్లో ఉండాల్సిన జంతువులు కాస్త చివరికి జనావాసాల్లోకి వచ్చేస్తూ ఉన్నాయి. అయితే ఇలా ఎక్కువగా జనాల మధ్య కనిపించే జంతువులు ఏవి అంటే అవి కోతులు అని చెప్పేస్తుంటారు. అక్కడ అని తేడా లేదు. ప్రతి చోటా కోతుల బెడద ఇటీవల కాలంలో తీవ్రంగా వేధిస్తుంది. అయితే మనుషులకు బాగా అలవాటు పడిపోయిన కోతులు.. ఏకంగా జనాలపై దాడులు చేసేందుకు కూడా భయపడటం లేదు.


 ఇక్కడ ఏకంగా కోతులు అభం శుభం తెలియని పిల్లాడిని పొట్టన పెట్టుకున్నాయ్. గుజరాత్ లోని గాంధీనగర్ జిల్లాలో ఏకంగా కోతి దాడిలో పదేళ్ల బాలుడు మరణించాడు. సల్కీ గ్రామంలో దీపక్ తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. అయితే ఒక్కసారిగా ఆ బాలుడు పై కోతి దాడి చేసింది. దీంతో అతడి పేగులు బయటకు వచ్చాయి. అయితే గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక ఆ గ్రామంలో ఈ వారంలో కోతుల దాడులు చేయడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అటు అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: