కరోనా చేసిన చేస్తున్న విలయ తాండవం అంతా ఇంతా కాదు. ఇప్పటికే ప్రాపంచవ్యాప్తంగా వందలాది దేశాలు ఈ మహమ్మరి కారణం పెను విపత్తు ను ఎదుర్కొంటూ సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోతూనే ఉన్నాయి. ఇప్పటికీ ప్రపంచ దేశాలను ఈ మహమ్మారి వదిలిపెట్టలేదు.లక్షలాది మంది ఈ ఈ వైరస్ ప్రభావానికి గురవ్వగా, వేలాది మరణాలు నిత్యం సంభవిస్తున్నాయి. అసలు ఈ ప్రభావం ఎప్పటికి పూర్తి గా అంతమవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు దీనికి సంబంధించి వ్యాక్సిన్ కూడా కనిపెట్టలేదు. మరో 18 నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అన్ని దేశాలు ఈ వైరస్ కు విరుగుడ మందు కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే అప్పటి వరకు ఈ వైరస్ మరింత విజృంభించకుండా కట్టుదిట్టమైన చర్యలను అన్ని దేశాలు తీసుకుంటున్నాయి. 

 

IHG's new FDI rules may open new flashpoint with <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CHINA' target='_blank' title='china-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>china</a> ...

పౌరుల మధ్య సామాజిక దూరం పాటించడం, ప్రజలు ఎవరు గుంపులు గుంపులుగా రోడ్లపైకి రాకుండా నివారించడం ఒక్కటే మార్గం ప్రపంచ దేశాలు భావిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నాయి. అలాగే లాక్ డౌన్ నిబంధనను విధించి పౌరుల రాకపోకలను నిషేధిస్తూ కఠిన నిబంధనలు పాటిస్తున్నాయి. అయితే అసలు ఇంతటి విపత్తు ప్రపంచం ఎదుర్కోవడానికి కారణం చైనా దేశం కారణం అని ప్రపంచంలోని అన్ని దేశాలు బలంగా నమ్ముతూ చైనాపై ఆగ్రహంగా ఉన్నాయి. చైనా ఆహారపు అలవాట్ల వల్ల ఈ వైరస్ పుట్టిందనే వాదనలు  ఒకవైపు. బయో వెపన్ గా కరోనాను అభివృద్ధి చేసి దీనిని చూపించి ప్రపంచ దేశాలను  భయపెట్టాలని చైనా భావించింది.

 


 ఆ దేశంలోనీ వుహాన్ పట్టణంలో ఉన్న బయో ల్యాబ్ లో దీనిని తయారు చేసినట్లుగా మరికొన్ని దేశాలు ఆరోపణలు చేస్తున్నాయి. అగ్ర రాజ్యంగా  పిలవబడుతున్న అమెరికా చైనాపై తరుచుగా విమర్శలు చేస్తోంది.ఈ విపత్తుకు అసలు కారణం చైనా నే అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనాపై విరుచుకుపడుతున్నారు. దీనికి అసలు చైనా నే బాధ్యత వహించాలంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ విపత్తుకు కారణమైన చైనా  పరిహారం చెల్లించాలని జర్మనీ వంటి దేశాలు నోటీసులు కూడా అందిస్తున్నాయి. ఇదిలా ఉంటే చైనాలో భారీగా పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించిన జపాన్, దక్షిణ కొరియా ఇంకా అనేక దేశాలు ఇప్పుడు చైనా నుంచి అన్ని కార్యాలయాలను, పరిశ్రమలను తరలించాలని చూస్తున్నాయి. దీనిలో భాగంగా ఆ పరిశ్రమలను భారత్లో స్థాపించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. 

 


ఇప్పటికే భారత ప్రభుత్వంలో ఈ మేరకు సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి అన్ని సంస్థలు భారత్ వైపు మొగ్గు చూపితే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు భారీగా లబ్ధి పొందడం, నిరుద్యోగ సమస్యలు తగ్గడం, పెట్టుబడుల కేంద్రంగా భారత్ గుర్తింపు పొందడం, మరికొన్ని దేశాలు ఇదే బాటలో పయనించే అవకాశం ఉండడం ఇలా ఎన్నో ప్రయోజనాలు భారత్ కు లభించే అవకాశం లేకపోలేదు. కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత ఆయా దేశాలు భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: