బంగారం ధరలు ఎలా భగ్గుమంటున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కరోనా వైరస్ కారణంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి కారణం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్టాక్ మార్కెట్లు దారుణంగా పడిపోవడంతో బంగారం, వెండి ధరలు అత్యంత దారుణంగా పెరిగిపోయాయి. 

 

అయితే అంత పెరిగినప్పటికీ బంగారం, వెండి ధరలు అప్పుడప్పుడు తగ్గుతూనే ఉన్నాయ్. ఒక రోజు వెయ్యి రూపాయిలు తగ్గితే.. మరో రోజు 500 పెరుగుతుంది.. ఇలా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ చెప్తూ భారీగా పతనమయ్యాయి. 100, 200 కాదు ఏకంగా 1,500 రూపాయిలు తగ్గిపోయాయి. 

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా భారీగా పతనమయ్యాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,680 రూపాయిల తగ్గుదలతో 44,290 రూపాయలకు చేరింది. ఇంకా ఇదే నేపథ్యంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1,500 రూపాయిల తగ్గుదలతో 40,600 రూపాయలకు చేరింది. ఇలా బంగారం ధరలు భారీగా తగ్గగా వెండి ధర భారీగా క్షిణించింది. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 690 రూపాయిల తగ్గుదలతో 41,290 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఆర్ధిక రాజధాని ముంబైలోను బంగారం ధరలు ఇలానే భారీగా కొనసాగుతున్నాయి. లాక్ డౌన్ ముగిసేవరకు ఏ ఒక్కరు బంగారం, వెండి ధరలు కొనలేరు. ఎంత తగ్గిన.. ఎంత పెరిగిన ఉపయోగం లేదు. ఎందుకంటే అందరూ ఇంట్లోనే ఉండాలి కాబట్టి.                                               

మరింత సమాచారం తెలుసుకోండి: