బంగారం ధరలు గత కొద్దీ రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి.. వారం రోజులు పెరిగితే రెండు రోజులు బంగారం ధరలు తగ్గుతున్నాయి.. ఇలా ఎంత తగ్గినప్పటికీ తగ్గిన బంగారం ధర రెట్టింపు అవుతుంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు.. ఇంకా ఈ కరోనా వైరస్ ప్రభావం కారణంగా బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయాయి. 

 

ఇలా బంగారం, వెండి ధరలు ఎప్పుడు పెరిగితే ఇకపై సామాన్యులు కొనలేరు.. కానీ కరోనా వైరస్ ప్రభావం స్టాక్ మార్కెట్ పై పడటం.. అవి దారుణంగా కుప్పకూలడం.. ఇంకా ఇన్వెస్టర్లు అంత కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చెయ్యడం మాములు అయిపోయింది.. ఇలా రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఏకంగా ఒక్క సంవత్సరానికి 16 వేలు పెరిగింది. ఇలానే పెరిగితే పరిస్థితి ఏంటి? 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు బంగారం ధర ఇలా కొనసాగుతుంది.. ఇంకా ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయ్. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 130 రూపాయిల పెరుగుదలతో 47,410 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 110 రూపాయిల పెరుగుదలతో 44,630 రూపాయలకు చేరింది. 

 

ఇంకా వెండి ధర కాస్త తగ్గింది అనే చెప్పాలి. దీంతో నేడు కేజీ వెండి ధర 200 రూపాయిల తగ్గుదలతో 42,000 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతుడగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 43 వేలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. కాగా బంగారం వెండి ధరలు ఎంత తగ్గినా పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుంది.. ఎప్పటివరుకు కొనసాగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: