
హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.210 పడిపోయింది. రూ.48,560కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 క్షీణించింది. దీంతో రేటు రూ.44,500కు తగ్గింది. ఇక వెండి ధరలు చూస్తే.. గురువారం వెండి ధర దిగొచ్చింది. రూ.100 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.75,900కు క్షీణించింది. అంటే తులం వెండి ధర దాదాపు రూ.759 వద్ద ఉందని చెప్పుకోవచ్చు. కాగా వెండి ధర గత ఏడాది ఆగస్ట్ నెలలో ఏకంగా రూ.79 వేలకు పైగా పెరిగిన విషయం తెలిసిందే.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర దిగొచ్చింది. బంగారం ధర ఔన్స్కు 0.26 శాతం పడిపోయింది. దీంతో పసిడి రేటు ఔన్స్కు 1817 డాలర్లకు క్షీణించింది. గ్లోబల్ మార్కెట్లో పసిడి ధర తగ్గుదల కారణంగా దేశీ మార్కెట్లోనూ అదే ట్రెండ్ కొనసాగింది.వెండి ధర ఔన్స్కు 0.02 శాతం తగ్గుదలతో 27.24 డాలర్లకు క్షీణించింది. గ్లోబల్ మార్కెట్లో వెండి ధరలు తగ్గడం వల్ల దేశీ మార్కెట్లోనూ వెండి రేటు దిగివచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు.కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి అంశాలు పసిడి ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి..