పసిడి ధరలు మార్కెట్ లో మండి పోతూన్నాయి.. ఈరోజు మార్కెట్ లో ధరలు భారీగా పైకి కదిలాయి. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంటున్నారు.. నిన్న, మొన్న ఒకే ధర తో ఉన్న బంగారం, వెండి ధరలకు నేడు మార్కెట్ లో రెక్కలు వచ్చాయి.. ఈ రోజు పసిడి కొనాలనుకునే మహిళలకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మార్కెట్ లో బంగారం ధరలు పెరిగితే.. వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఇక వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి.


ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు పరిసీలిస్తె..మంగళవారం బంగారం ధర పెరిగింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పైకి కదిలింది. దీంతో ఇప్పుడు పసిడి రేటు రూ. 51,700కు చేరింది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. పసిడి రేటు రూ.100 పెరగడంతో రూ. 47,400కు పెరిగింది. బంగారం ధరలు భారీగా పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. రూ.300 పెరిగింది. దీంతో సిల్వర్ రేటు రూ. 72,600కు ఎగసింది. విజయవాడ, విశాఖపట్నంలో ఇదే ధరల తో బంగారం, వెండి కొనసాగుతున్నాయి.


ఇకపోతే.. మన దేశంలో ధరలను చూసాము.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో ధరలను ఒకసారి చూస్తె..అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.30 శాతం పైకి చేరింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1935 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా జిగేల్ మంది. వెండి ధర ఔన్స్‌కు 0.40 శాతం పెరుగుదలతో 25.41 డాలర్లకు పెరిగింది.. మార్కెట్ లో బంగారం ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలగునవి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: