బంగారం కొనాలనుకునే వారికి ఈరోజు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. నిన్న మార్కెట్ లో భారీగా పెరిగిన పసిడి ధరలు నేడు మార్కెట్ లో స్థిరంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు నేడు నిలకడగా ఉండటం విశేషం..బంగారం ధరలు స్థిరంగా వుంటే.. వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా పసిడి కిందకు వచ్చాయని అంటున్నారు. ఈరోజు మన దేశంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము... కిలో వెండిపై ఏకంగా రూ. 1000కి పైగా తగ్గింది..



ఆదివారం మార్కెట్ లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడాలి.. న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590వద్ద వుండగా, ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590వద్ద కొనసాగుతుంది. చెన్నై లో మాత్రం బంగారం ధర చేరింది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ. 120 తగ్గి రూ. 52,840 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590గా కొనసాగుతుంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590 గా ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590 గా నమోదైంది. విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590 వద్ద స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో ఆదివారం కిలో వెండి ధర రూ. 73,400 వద్ద ఉంది.



అంతర్జాతీయ మార్కెట్ లో కూడా పసిడి ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయని అంటున్నారు.ఔన్స్‌కు 0.25 శాతం దిగి వచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1959 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.67 శాతం తగ్గుదలతో 26.73 డాలర్లకు క్షీణించింది. మరో వైపు మార్కెట్ లో బంగారం ధరలు పై..ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలగునవి ప్రభావాన్ని చూపిస్తాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: