చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్యమైన సంఘటనల విషయానికి వస్తే..

1851 వ సంవత్సరంలో ఇసాక్ సింగర్ కనిపెట్టిన కుట్టు మిషన్కి పేటెంట్ ఇవ్వడం జరిగింది.అది 40 డాలర్లతో, బోస్టన్ లో వ్యాపారం మొదలుపెట్టడం జరిగింది.

1936 వ సంవత్సరంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, (ఏ.ఇ.ఎస్.ఎఫ్. - అఖిల భారత విద్యార్థిసమాఖ్య), ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో స్థాపించబడటం జరిగింది.

1976 వ సంవత్సరంలో లండన్ లోని నేషనల్ థియేటర్ ని బ్రిటిష్ రాణి ప్రారంభించడం జరిగింది.

1978 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో రంగారెడ్డి జిల్లా అవతరించడం జరిగింది.

2009 వ సంవత్సరంలో ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చూడగల సాంకేతిక పరిజ్ఞానం భువన్ ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించడం జరిగింది.

2010 వ సంవత్సరంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని బాలికలకు యవ్వనం తొందరగా వస్తున్నదని ఇక అందుకని ఆ బాలికల ఆరోగ్యం ప్రమాదకరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది.అలాగే పవిత్ర రంజాన్ పండుగ భారతదేశంలో ఈ సంవత్సరంలో నేటితో ప్రారంభమవుతుంది.

2011వ సంవత్సరంలో విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2011-12 సంవత్సరానికి గాను శుక్రవారం ఎన్నికలు జరిగాయి.ఇక 2788 ఓటర్లు ఉండగా 1791 మంది ఓట్లు వేయడం జరిగింది. అలాగే ఇక 997మంది ఓట్లు వేయలేదు.

1892 వ సంవత్సరంలో ఎస్.ఆర్.రంగనాథన్ జన్మించారు. ఈయన భారతదేశ గ్రంథాలయ పితామహుడు.ఈయన పుట్టినరోజుని భారతదేశం జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది.

1892 వ సంవత్సరంలో కె.ఎ.నీలకంఠ శాస్త్రీ జన్మించారు. ఈయన దక్షిణ భారతదేశపు చరిత్రకారుడు. ఇక అలాగే పద్మభూషణ్ పురస్కార గ్రహీత.

1919 వ సంవత్సరంలో విక్రం సారాభాయ్ జన్మించారు.ఈయన భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త అలాగే భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు.ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన మరణాల విషయానికి వస్తే..30 బి.సి లో క్లియోపాత్ర మరణించారు. ఈమె ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియాలో (39 సంవత్సరల వయసు) ఆత్మహత్య చేసుకుంది (జ. 69 బి.సి.). ఇక ఈమెను ప్రపంచ సుందరిగా పిలుస్తారు.ఈమె ఓ గొప్ప ఈజిప్ట్ మహారాణి.

1944 వ సంవత్సరంలో కైవారం బాలాంబ మరణించారు. వీరు అన్నదాత, 1926లో మంగళగిరి అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: