కరోనా వైరస్ బారిన పడిన రోగులలో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, రక్తం గడ్డ కట్టడం, ఊపిరితిత్తుల్లోని కణజాలాలు దెబ్బతినడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటివి చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మూడు వ్యవస్థలను మెరుగుపరచడానికి అడ్డసరం మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది అని పరిశోధనలో తేలింది. వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడే జన్యువులకు సహాయపడే గుణాలు అడ్డసరం లో ఉన్నాయని ఒక అధ్యయనం కనుగొన్నది..