ఇక కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో కేసులు చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి. అలానే మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందరికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది.ఇక జనవరి 16 న భారీ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. తరువాత లక్షలాది మందికి వ్యాక్సిన్లు వెయ్యడం జరిగింది. ఇప్పుడు మూడో దశలో ‘వ్యాక్సిన్ ఫర్ ఆల్’ డ్రైవ్‌ కింద 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ లు వేస్తుంది.ఇక చాలా మందికి వ్యాక్సిన్ వేయించుకోవడం వలన అది శరీరానికి సరిగ్గా పడక చనిపోతారేమోనని లేక ఏమైనా సమస్యలు వస్తాయేమోనని చాలా మంది అపోహ పడుతూ భయపడుతున్నారు.కాని అలాంటిది ఏమి లేదు.


వ్యాక్సిన్ వేయడం అంటే మీరు కరోనా వైరస్ బారిన పడ్డారని కాదు. ఒకవేళ రోగం వచ్చినా ఏం కాకుండా ఉండటానికి వేస్తున్నారు. టీకా వేసుకోన వారికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం చాలా అవసరం.వ్యాక్సిన్ వేసుకుంటే అలర్జీలు వస్తున్నాయనడంలో నిజం లేదు. మిమ్మల్ని పరీక్షించిన తర్వాతే టీకా వేస్తారు.ఇక వ్యాక్సిన్లు వేసిన తరువాత మీరు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ప్రజల నుంచి 6 అడుగుల దూరంలో ఉండాలి. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం మర్చిపోకూడదు. డోర్క్‌నోబ్స్, కిచెన్ కౌంటర్‌, ట్యాప్‌ హ్యాండిల్స్ వంటి వాటిని సానిటైజ్ చేస్తూ ఉండాలి.


వ్యాక్సిన్లు వేసిన తర్వాత మీరు కరోనా లక్షణాలను గమనించినట్లయితే ఏమాత్రం భయపడొద్దు.డాక్టర్ ని సంప్రదిస్తే సరిపోతుంది.ఇక వ్యాక్సిన్ తర్వాత కొన్ని రోజులు మీకు తలనొప్పి, జ్వరం, చలి, అలసట, చేతి నొప్పి వంటి దుష్ప్రభావాలు రావచ్చు. డాక్టర్ సూచించిన మందులు తీసుకొని విశ్రాంతి తీసుకోండి. వేడి వేడి సూప్‌లు తాగండి. ఇంకా ఏమైనా సమస్యలుంటే వైద్యుడిని సంప్రదించండి.వ్యాక్సిన్ వేసుకున్నాక కఠినమైన పనులు చేయకండి. కొన్ని రోజులు మద్యం, ధూమపానం  లాంటి చెడు వ్యసనాలను మానుకోవడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: