మొదటిసారి కరోనా ఫస్ట్ వేవ్ అన్నారు.. ఆ తరువాత కరోనా సెకండ్ వేవ్ అన్నారు.. మరి ఇప్పుడేమో కరోనా థర్డ్ వేవ్ వస్తుంది అని చెబుతూ ఉండగానే మధ్యలో ఒమిక్రాన్ అనే మరో సరికొత్త వైరస్ వచ్చిందని అందరినీ భయపెడుతున్నారు. నిజం చెప్పాలంటే కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఎంతోమంది ధన, ప్రాణ నష్టాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఉద్యోగాలను కోల్పోయి.. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారిని మనం చూస్తూనే వుంటాం. కరోనా రెండు వేవ్ లతో సతమతమై పోయి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలామందే ఉన్నారు. ఇకపోతే ఈ ఒమిక్రాన్ వైరస్ అనేది ఎలా ఉంటుంది..అది మనకు సోకిందని ఎలా పసిగట్టాలి.. తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ ఒమిక్రాన్ వ్యాధి సోకిందని మనకు ఎలా తెలుస్తుంది.. వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాలకు  ఈ కరోనా ఒమిక్రాన్ వ్యాపించింది ఇక ఇప్పటికే దాదాపు సగానికి పైగా దేశాలు ఈ వైరస్ బారిన పడి సతమతమవుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో కూడా ఈ ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో .. శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనంలో కొన్ని విషయాలను వెల్లడించడం జరిగింది.ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయనే విషయం పై  కొవిడ్-19 ట్రాకింగ్ స్టడీ పేరుతో తాజాగా ఒక  అధ్యయనం జరిగింది.


మనకు కరోనా ఒమిక్రాన్ సోకినట్లయితే.. ప్రధానంగా ముక్కు కారడం, తలనొప్పి, వాంతి వచ్చినట్లు అనిపించడం.. తల తిరిగినట్లుగా అనిపించడం, గొంతులో గరగర లాంటి లక్షణాలు మనలో కనిపిస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ ఒమిక్రాన్ కి సంభందించిన ప్రధాన లక్షణాలన్ని సాధారణ జలుబు లక్షణాలనే పోలి ఉంటాయని అధ్యయనం తెలిపింది. ఒమిక్రాన్ బారినపడిన వేలమంది నుంచి వారి అభిప్రాయాలు సేకరించి తాజా నివేదికను సిద్ధం చేసినట్లు అధ్యయనకారులు తెలిపారు. అయితే..మిగతా  కరోనా వేరియంట్ల లాగా.. ఈ వేరియంట్ సోకిన వారిలో ఎడతెగని దగ్గు, రుచిని కోల్పోవడం , తీవ్రమైన జ్వరం, వాసన కోల్పోవడం  లాంటి లక్షణాలేవి కనిపించలేదని అధ్యయనకారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: