ఈ రోజుల్లో మధుమేహం అనేది అందరికీ వచ్చే ఒక సాధారణమైన ఇంకా ప్రమాదకరమైన సమస్య. ఈ జబ్బు కారణంగా ప్రపంచంలోని చాలా మంది ప్రజలు కూడా ఎన్నో రకాల ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం పిల్లల్లో కూడా మధుమేహం సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తోంది.మన కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే పిల్లలకు కూడా మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ మధుమేహం అంటే రక్తంలో చక్కెర స్థాయి పెరగడం..సాధారణంగా ఈ జబ్బు అనేది శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ లేకపోవడం వల్ల వస్తుంది.ఇక రక్తంలో చక్కెరను నిర్వహించడానికి ఇన్సులిన్ అనేది పనిచేస్తుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోయినప్పుడు, తగ్గినప్పుడు, అప్పుడు మధుమేహం సమస్య తలెత్తుతుంది.పిల్లల్లో మధుమేహం వస్తే పిల్లలకు దాహం చాలా రెట్లు పెరుగుతుందట. ఇంకా అలాగే బిడ్డకు కొన్నిసార్లు కంటిచూపు సమస్య ఉంటే అది మధుమేహం లక్షణం కావచ్చు.ఇంకా అలాగే తరచుగా మూత్రవిసర్జన చేయడం కూడా మధుమేహం యొక్క లక్షణం.


ఈ మధుమేహం సమస్య ఉన్న పిల్లలు ఖచ్చితంగా కూడా చాలా ఆకలితో ఉంటారు.ఇంకా అలాగే అదే సమయంలో వారు చాలా బలహీనంగా కనిపిస్తుంటారు.అలాగే పిల్లలలో ఎక్కువగా చర్మ సమస్యలు కూడా మధుమేహాన్ని సూచిస్తాయి.ఇంకా వేగంగా బరువు తగ్గడం కూడా మధుమేహం యొక్క ముఖ్య లక్షణం కావచ్చు.మీ పిల్లలో గనుక ఇలాంటి లక్షణాలు అనేవి కనిపిస్తే ఖచ్చితంగా ఆలస్యం చెయ్యకుండా వైద్యుడిని సంప్రదించాలి.అలాగే ముఖ్యంగా ఇంటి నివారణలు కూడా హానికరమని గుర్తుపెట్టుకోవాలి. ఈ మధుమేహం సమస్యని ప్రారంభ దశలోనే గుర్తించినట్టయితే, దానిని ఈజీగా కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు.మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్య నిపుణుల సలహా ప్రకారం ఆహారం ని తీసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్యాక్డ్ ఫుడ్, వైట్ రైస్  ఇంకా అలాగే శీతల పానీయాల వినియోగానికి ఖచ్చితంగా చాలా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆకుపచ్చ కూరగాయలు, గింజలు ఇంకా అలాగే అవిసె గింజలు మొదలైనవి చాలా ఎక్కువగా తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: