ప్రస్తుత కాలంలో కంటి నిండా నిద్ర పోవాలంటే ఎంతో కష్టం అవుతుంది. నిద్రలేమి కారణంగా  ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణించే వారు, ఎక్కువ సేపు కంప్యూటర్ ల ముందు కూర్చుని పని చేసే వారు ఖచ్చితంగా ఎక్కువ సమయం నిద్రపోవాలి. కానీ చాలా మంది మానసిక ఒత్తిడి ఇంకా అలాగే ఆందోళన కారణంగా నిద్ర సరిగ్గా పట్టక చాలా ఇబ్బంది పడుతుంటారు. కొన్ని టిప్స్ పాటించడం వల్ల మనం నిద్రలేమి సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.ఒక అరటి పండును తీసుకొని దాని తొక్క తీయకుండా శుభ్రంగా కడిగి చివర్లను తొలగించాలి. తరువాత దీనిని ముక్కలు ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి.ఆ తరువాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లను పోసి వాటిని వేడి చేయాలి.ఇక ఆ నీళ్లు వేడయ్యాక అందులో అరటి పండు ముక్కలను ఇంకా అలాగే దాల్చిన చెక్క పొడిని వేసి మరిగించాలి. ఆ నీళ్లు మరిగిన తరువాత స్టవ్ ఆపి చేసి నీటిని వడకట్టుకోవాలి. తరువాత దీనిలో తగినంత షుగర్ ఫ్రీ చక్కెరను కలిపి గోరు వెచ్చగా  తాగాలి. ఈ నీటిని తాగడం వల్ల ఖచ్చితంగా సుఖమైన చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఇంకో టిప్ ఏంటంటే 5 గ్రాముల జాజికాయ, 5 గ్రాముల జాపత్రి, 5 గ్రాముల మరాఠి మొగ్గలు ఇంకా అలాగే 3 గ్రాముల పచ్చ కర్పూరం తీసుకుని మెత్తని పొడిలా చేసి స్టోర్ చేసుకోవాలి.


ఇంకా ఈ పొడిని రోజూ రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలల్లో పావు టీ స్పూన్  కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల  నిద్రలేమి సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. ఈ చిట్కాలను రెగ్యులర్ గా పాటించడం వల్ల మన ఒత్తిడి ఇంకా అలాగే ఆందోళన తగ్గి ఖచ్చితంగా చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చు.ఈ చిట్కాలు పాటిస్తూనే ఈ అలవాట్లు కూడా పాటించాలి.మనం నిద్ర పోయే సమయం ఇంకా నిద్రలేచే సమయం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండేలా చూసుకోవాలి.అలాగే నిద్రించే ముందు లైట్ గా వుండే ఆహారాన్ని తీసుకోకూడదు. పగటి పూట నిద్రపోవడం మానేయాలి.ఇంకా అలాగే పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను ఖచ్చితంగా తాగాలి.ఇంకా అలాగే సాయంత్రం పూట యోగా, వాకింగ్ తో పాటు చిన్న చిన్న వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి.ఈ అలవాట్లు పాటిస్తే నిద్ర లేమి సమస్య శాశ్వతంగా దూరం అవుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. నిద్ర లేమి సమస్యని శాశ్వతంగా దూరం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: