ఇక మన నోటిలో ఉండే క్రిములను చంపి పళ్ళు పుచ్చిపోకుండా ఉండాలని మనం మార్కెట్ లో దొరికే రకరకాల టూత్ పేస్ట్ లను వాడుతూ ఉంటాం. ఎన్ని రకాల టూత్ పేస్ట్ లు వాడినా కూడా దంతాలు పుచ్చిపోతూనే ఉంటాయి. అలాగే చాలా మంది రోజుకు రెండు సార్లు పళ్ళను శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అయినా కానీ దంతాలు పుచ్చిపోతూ ఉంటాయి.పళ్ళు పుచ్చిపోకుండా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పంచదారతో చేసిన తీపి పదార్థాలు, చాక్లెట్లు, మైదా పిండితో చేసిన పదార్థాలు, శీతల పానీయాలు, టీ, కాఫీల వంటి పదార్ధాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అయితే చాలా మంది ఇటువంటి ఆహారపదార్థాలు ఎక్కువగా తింటూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు ఎక్కువ తింటారు. ఇలాంటి పదార్థాలు తిన్నప్పటికి దంత క్షయం కాకుండా ఉండాలంటే చెరుకు ముక్కలను బాగా నమలాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనం చేసిన తరువాత చెరుకు ముక్కలను తినడం వల్ల దంత క్షయం జరగకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చెరుకు ముక్కలు నమలడం వల్ల దంతాలు, ఇంకా చిగుళ్లు తాజాగా ఉంటాయి.


 చెరుకును నమిలేటప్పుడు దీనిలో ఉండే ఫైబర్ దంతాలను అలాగే చిగుళ్లను బాగా శుభ్రపరుస్తుంది.ఇక దంతక్షయానికి కారణమయ్యే చెడు బ్యాక్టీరియాలను నశింపజేసే యాంటీ ఆక్సిడెంట్లు చెరుకులో చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే రోజులో సాధ్యమైనంత వరకు మొలకెత్తిన గింజలను, దానిమ్మ గింజలను, తాజా పండ్లు, కొబ్బరి, ఉడికించని స్వీట్ కార్న్ గింజలను ఇంకా అలాగే నారింజ తొనలను నమిలి తినాలి. ఇలా తినడం వల్ల దంతాలు బాగా శుభ్రపడతాయి. అలాగే దంతాలకు గారపట్టకుండా ఉంటుంది. వీటిని తినడం వల్ల వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా నోట్లో ఉండే బ్యాక్టీరియాలు ఈజీగా నశిస్తాయి. ఇక మన నోట్లో  లాలాజలమే క్రిమి సంహారక శక్తిని కలిగి ఉంటుందని ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల నోట్లో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా చెరుకు ముక్కలను ఇంకా సహజంగా లభించే పదార్థాలను ఎక్కవగా తినడం వల్ల దంతాలను పుచ్చిపోకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: