బిర్యాని.. ఈ పేరు చెబితే చాలు ఫుడ్ లవర్స్ కు మాత్రమే కాదు  సామాన్యులకు కూడా నోరూరిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే బిర్యానీ టేస్ట్ ఆ రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా బిర్యానీ అనగానే గుర్తుకు వచ్చేది హైదరాబాద్.  హైదరాబాద్ నగరంలో ఉండే బిర్యాని ఇక దేశవ్యాప్తంగా ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఎంతో మంది ప్రముఖులు హైదరాబాద్ వచ్చి ఇక్కడ బిర్యాని రుచినీ ఎంతగానో ఆస్వాదిస్తూ ఉంటారో అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే సంతోషం వచ్చిన బాధ వచ్చిన ఫంక్షన్ జరిగిన.. పరీక్షల్లో పాసైన ప్రతి ఒక్కరు కూడా బిర్యానీ పార్టీ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాదు బిర్యానీలోని గుమగుమలను ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. అందుకే సీజన్ తో సంబంధం లేకుండా అటు బిర్యానీ అమ్మే రెస్టారెంట్లు అన్నీ కూడా కస్టమర్లతో కలకలలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు హైదరాబాద్లో రికార్డు స్థాయిలో బిర్యానీలో అమ్మకం జరగడం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి.


 ఇటీవల ఇలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అది చెప్పాలి. హైదరాబాద్లో గడిచిన ఆరు నెలల్లో ఏకంగా 72 లక్షల బిర్యానిలు ఆర్డర్ చేసినట్లు ఇటీవల స్విగ్గి ప్రకటించింది. దీంతో దేశంలో అటు హైదరాబాద్ బిర్యానీ రాజధానిగా అవతరించింది అని చెప్పాలి. అంతేకాదు గత 12 నెలల్లో 150 లక్షల బిర్యానిలు కేవలం ఒక స్విగ్గిలోనే ఆర్డర్ చేశారట. ఇక స్విగ్గి కాకుండా జొమాటో లాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. అవి కాకుండా నేరుగా రెస్టారెంట్ కు వెళ్లి తీసుకునే వారు కూడా చాలామంది ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇక హైదరాబాద్లో బిర్యానిలు ఏ రేంజ్ లో అమ్ముడుపోయాయో ఊహించుకోవడం కూడా కష్టమే. అయితే కేవలం స్విగ్గిలోనే గత ఏడాది ఆర్డర్లతో పోల్చి  చూస్తే 8.39% వృద్ధిరేటు చూపుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: