కర్పూరవల్లి ఆకులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే వీటిని మనం ఔషధంగా తీసుకుంటూ ఉంటాము. ఆయుర్వేదంలో వీటిని ఔషధంగా ఉపయోగించి ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తారు. ఈ ఆకులు కూడా చేదు రుచిని కలిగి ఉంటాయి. ఇక కోకో గింజలు కూడా చేదు రుచిని కలిగి ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. గుండె మరియు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి మనకు సహాయపడతాయి.అలాగే తీపి మరియు వగరు రుచులను కలిగి మన ఆరోగ్యాన్ని మేలు చేసే వాటిల్లో నేరేడు పండ్లు కూడా ఒకటి. వీటిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల పూర్తి శరీరానికి మేలు కలుగుతుంది. అలాగే మన ఆరోగ్యానికి మేలు చేసే మూలికల్లో కల్మేఘ్( బిట్టర్స్ రాజు) ఒకటి. దీనిని ఆండ్రోగ్రాఫిన్ పానిక్యులాటా అని పిలుస్తారు. దీనిని ఔషధంగా తీసుకోవడం వల్ల జ్వరం, జలుబు, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో కాకరకాయ కూడా ఒకటి. ఇది ఎంత చేదుగా ఉంటుందో మనందరికి తెలుసు. కానీ కాకరకాయను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కాకరకాయలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాకరకాయను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇక మెంతి గింజలు కూడా చేదుగా ఉంటాయి. కానీ వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. చేదుగా ఉన్నప్పటికి ఈ మెంతి గింజలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.వేప ఎక్కువగా యాంటీ ఇన్ ప్లామేటరీ, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంటుంది. వేపను ఉపయోగించడం వల్ల మనం అనారోగ్య సమస్యలను చాలా సులభంగా దూరం చేసుకోవచ్చు.చేదుగా ఉన్నప్పటికి మన ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో వేప కూడా ఒకటి. వేప ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో వేపను ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటారు.పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పసుపును తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: