ఎండాకాలం వచ్చేసింది. ఇక సీజన్ మారితే అలర్జీలు, వైరల్ ఇన్ఫెక్షన్లు కలగడం సర్వ సాధారణం. అయితే వీటికి పసుపు నీరు ఎంతో మంచి ఔషధంగా పనిచేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. చిటికెడు పసుపు మన ప్రాణాన్ని అనేక రోగాల నుంచి కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఇంకెన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.టైప్-2 డయాబెటిస్ చికిత్సలో పసుపు సూపర్ మెడిసిన్ గా పని చేస్తుంది.పసుపు క్యాన్సర్, ట్యూమర్ సెల్స్ పెరగకుండా నిరోధిస్తుంది.అల్జిమర్స్ లాంటి మెదడు సంబంధింత సమస్యలతో బాధపడేవారు రోజూ పసుపును తీసుకోవడం చాలా మంచిది.పసుపు నీటిలోని నిర్విషీకరణ లక్షణాలు శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తాయి. రక్తం శుభ్రపరిచే ప్రక్రియను మెరుగుపరుస్తాయి.పసుపు నీటిలోని నిర్విషీకరణ లక్షణాలు శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తాయి. రక్తం శుభ్రపరిచే ప్రక్రియను మెరుగుపరుస్తాయి.పసుపు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు, ఇన్ఫెక్షన్లను దూరం చేయవచ్చు.


పసుపు నీటిలో కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ఇది మన జీర్ణశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఉబ్బరం లక్షణాలను తగ్గిస్తుంది.పసుపు మన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది.పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి వాపు సంబంధిత సమస్యల నుండి విముక్తి పొందేందుకు సహజ నివారణగా చేస్తాయి.పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన రక్తాన్ని శుద్ధి చేయడంలో, చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి.శ్వాసకోశ సమస్యలతో పాటు క్యాన్సర్ మహమ్మారితో కూడా పసుపు పోరాడుతుంది.మన పురాతన కాలం నుంచి అన్ని వంటల్లో కూడా చిటికెడు పసుపును వినియోగిస్తారు. యాంటీ వైరల్, యాంటి ఇన్ఫెక్షనల్‌గా ఉపయోగపడుతుంది. పసుపు క్యాన్సర్‌తో పోరాడి డిప్రెషన్‌ని తగ్గించే సూపర్ ఫుడ్. పసుపులోని చాలా సమ్మేళనాలు మన ఆరోగ్యానికి తోడ్పడతాయి. వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది కర్కుమిన్. ఇది డిప్రెషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: