మానవుని శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో కాలేయం కూడా ఒకటి.. ఇది మన రక్తంలో ఉండేటువంటి వ్యర్ధపదార్థాలను ఆహారాన్ని సైతం జీర్ణం చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాలేయం సరిగ్గా పని చేయకపోతే పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అలాంటి వాటిలో కామెర్లు కూడా ఒకటి.. ఇది రక్త ప్రవాహంలో కలిసిపోయి బిల్రు బీన్ కొవ్వులో కరిగిపోతుందట.. అందువల్లే చర్మం, కళ్ళు, చిగుళ్ళు కూడా పసుపు రంగులోకి మారుతాయని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. అయితే కామెర్ల వ్యాధి వచ్చిన వారికి జీర్ణక్రియ మెరుగుపరిచే ఆహార పదార్థాలను ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


బ్రౌన్ రైస్ ,గోధుమలు వంటి తృణధాన్యాలు తీసుకోవడం వల్ల ఇందులో ఫైబర్ ఫినోలిక్ ఆమ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కాలేయం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాలేయానికి క్యాన్సర్ వంటివి రాకుండా కూడా కాపాడుతుందట.


చేపలు, పౌల్ట్రీ వంటి వాటిలో లిన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కామెర్లు సైతం రాకుండా అడ్డుకుంటాయి. వీటిని కామెర్ల బారిన పడ్డవారు కూడా తినవచ్చు.


కామెర్ల వచ్చినవారు వేయించిన ఆహార పదార్థాలు కొవ్వు ఉన్న ఆహార పదార్థాలను అసలు ముట్టుకోకూడదు. ఇలాంటి ఆహార పదార్థాలు తింటే కాలేయం త్వరగా ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం కష్టంగా మారుతుందట.


పచ్చ కామర్ల సమస్య ఉన్నవారు రోజుకి కనీసం ఐదు లీటర్ల నీటిని తాగుతూ ఉండాలి.. ఇలా తాగడం వల్ల పచ్చ కామర్ల సమస్య తగ్గడానికి తక్కువ సమయం పడుతుంది. నీటిని ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయని ఇటీవలే ఒక పరిశోధనలు తేలింది. సగటు మనిషి రోజుకి ఐదు నుంచి 8 లీటర్ల నీటిని తాగడం మంచిది.

తాజా పండ్లు కాయగూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పచ్చ కామర్ల సమస్య తగ్గించుకోవచ్చు.. ముఖ్యంగా బెర్రీ జాతికి చెందిన బొప్పాయి, దానిమ్మ, ద్రాక్ష పండ్లను తీసుకోవడం మరింత మంచిదంటూ నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: