ప్రస్తుతం చాలామంది ల్యాప్ ట్యాప్ ముందు కూర్చొని పనిచేయడం సర్వసాధారణంగా మారుతోంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇతరత్రా ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోం పేరిట ఇంటి దగ్గర నుంచి పనిచేసుకుంటూ ఉంటారు. దీంతో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ల్యాప్ ట్యాప్ లోనే పనిచేస్తున్నారు. దీనివల్ల ఎన్నో రకాల సమస్యలు కూడా ఎదురవుతున్నాయని పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు.ల్యాప్ ట్యాప్ దగ్గర ఎక్కువ సమయం కూర్చోవడం మంచిది కాదంటూ వైద్యులు తెలియజేస్తున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయని తెలుపుతున్నారు.ల్యాప్ ట్యాప్ దగ్గర కూర్చొని పనిచేసే వారు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాల్సి ఉన్నదట..



స్క్రీన్ వైపుగా ఎక్కువసేపు చూస్తే కంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని..దీనివల్ల కళ్ళు కూడా పోడి బారటం ,మెడ నొప్పి, సిండ్రోమ్, భుజాల నొప్పి మెడ నొప్పి తీవ్రమైన ఒత్తిడి ఇతరత్రా సమస్యలకు దారి తీసేలా ఉంటుందట.


ఎక్కువసేపు ల్యాప్ ట్యాప్  నడుమునొప్పి రావడమే కాకుండా ఉబకాయం కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట.ల్యాప్ ట్యాప్ ఉపయోగించేటప్పుడు ఒకే చోట కూర్చోవడం వల్ల బరువు పెరగడానికి కారణమవుతుంది.


అందుకే కనీసం గంటకు ఒకసారైనా లేచి ఐదు నిమిషాలు అటు ఇటు నడచడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. భుజాల మధ్యలోని వీపు కూడా బిగుసుకున్నట్టుగా ఉన్నప్పుడు ఎక్కువసేపు కూర్చోకుండా ఉండడమే మంచిది.

ల్యాప్ ట్యాప్ ఎక్కువ గంటలు ఉపయోగించడం వల్ల శరీరం అలసిపోయేలా ఉంటుందట.. ఇది చాలా ప్రమాదం అంటూ వైద్యులు తెలియజేస్తున్నారు.


అందుకే ఉదయం లేవగానే కాస్త ఎక్సర్సైజులు, వ్యాయామం చేయడం మంచిది.. ముఖ్యంగా ల్యాప్ ట్యాప్ ను తలకు సమానంగా ఉండేలా స్క్రీన్ ని సెట్ చేసుకోవాలి.. అప్పుడే కంఫర్ట్ గా కూర్చులో కూర్చున్న కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.


ఎక్కువసేపు ఏదైనా స్క్రీన్ ముందర కూర్చోవడం వల్ల నిద్రపైన చాలా ప్రభావం చూపిస్తుంది. దీంతో నిద్రలేని సమస్యలు కూడా ఏర్పడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: