పానీపూరీ ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.అయితే నేటి కాలంలో చాలా మంది వ్యాపారులు స్వలాభం కోసం అన్నింటిని కల్తీ చేస్తున్నారు. చాలా సార్లు పానీపూరీ విషయంలో కూడా ఇలాంటి ఘోరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పానీపూరీని తయారు చేసే వారు నకిలీ మసాలాలను వాడుతున్నారని అలాగే పానీపూరీలో వేసే నీరు కూడా మురికి నీరు అని కలుషితమైన నీటిని పానీపూరీలో ఉపయోగిస్తున్నారని అలాగే పూరీ తయారీకి వాడే పిండిని కాళ్లతో తొక్కి తయారు చేస్తున్నారని ఇలా చాలా రకాల విషయాలు కూడా మనకు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి. పైగా వీటికి సంబంధించిన వార్తలను ఫోటోలు, వీడియోల రూపంలో ఇప్పటికి మనం సోషల్ మీడియాలో చాలా చూస్తూనే ఉన్నాం.అలాగే పానీపూరీకి సంబంధించిన మరో దారుణమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.ఈ పానీపూరీ నీళ్లల్లో యాసిడ్ కలిపి అమ్ముతున్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది.ఎందుకంటే ఆ నీటిలో యాసిడ్ కలపడం వల్ల పానీపూరీ రుచి పెరుగుతుందని దీంతో తరుచూ ప్రజలు పానీపూరీని తినడానికి తమ్మ వద్దకే వస్తారు అనే దురుద్దేశంతో వ్యాపారులు ఇలా దారుణాలు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.


ఇంకా అలాగే మనం తినే పానీపూరీ నీటిలో యాసిడ్ కలిపారా లేదా అనే విషయాన్ని కూడా చాలా సులభంగా గుర్తించవచ్చని వారు నిపుణులు చెబుతున్నారు. పానీపూరీలో నీటి రంగు అనేది చాలా తేలికగా మారితే వారు నీటిలో యాసిడ్ కలపారని అర్థం. ఇంకా అలాగే స్టీల్ ప్లేట్ లో గనుక పానీపూరీని ఇస్తే ప్లేట్ పై తెల్లటి గుర్తులు కూడా ఏర్పడతాయి. దీనిని బట్టి కూడా నీటిలో యాసిడ్ కలపారని మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు.ఇంకా అంతేకాకుండా యాసిడ్ కలిపిన పానీపూరీని తినప్పుడు మన దంతాలపై ఒకలాంటి పొర కూడా ఏర్పడుతుంది. ఇంకా అలాగే గొంతులో చికాకు, మంట, కడుపులో నొప్పి వంటి సమస్యలు కూడా మనకు తలెత్తుతాయి.కాబట్టి ఇటువంటి లక్షణాలను ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజలను కూడా అప్రమత్తం చేయడం మంచిది. వీటితో పాటు ఎక్కడపడితే అక్కడ ఇటువంటి చిరుతిళ్లను తీసుకోవడం మంచిది కాదని ఇలాంటి నాణ్యతలేని చిరుతిళ్లను తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: