నేటి సమాజంలో చాల మంది ఎదుర్కొంటున్న సమస్యం మలబద్దకం. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఆరోగ్యకరమైన ఆహరం మాత్రమే తీసుకోవడం అనేది కాస్త కష్టతరమైందే. అప్పటికప్పుడు దొరికే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తో మలబద్ధం సమస్య పెరిగిపోతోంది. ముఖ్యంగా చలికాలంలో అయితే ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని అంటున్నారు నిపుణులు. ఫలితంగా కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు, వాటితో పాటే ఇతర రుగ్మతలు ఏర్పడతాయి. కొన్ని చిట్కాలను పాటిస్తే పిల్లలలో సాధారణ మలబద్దక సమస్యలను మనం సింపుల్ గా పరిష్కరించవచ్చు.

ఇక మలబద్ధకం సమస్య ఉన్న 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం.. 8-10 ఎండుద్రాక్షలను 2 టేబుల్ స్పూన్ల వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత అదే నీటిలో వాటిని పిండి పై తొక్కను వేరు చేసి పిల్లలకు ఆ రసం తాగించాలి. అల్లం, పీచు ఎక్కువగా ఉండే బీరకాయ లాంటి  కూరగాయలను తీసుకోవడం వల్ల కూడా మలబద్దకం సమస్య తీరుతుంది. అరటి మలబద్ధకం సమస్యకు మెడిసిన్ గా పనిచేస్తుంది. పిల్లలకు రోజుకు కనీసం ఒక అరటిపండు ఇవ్వండి. ఇది మలబద్ధకం నివారణకు సహాయపడుతుంది.

అయితే ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను అధికంగా ఇవ్వాలి. ఈ రకమైన కూరగాయలు మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి. నీరు ఎక్కువ తాగడం వలన మలబద్ధకం సమస్య పరిష్కారం అవుతుంది. మలబద్ధకం ఉన్నప్పుడు, ఎక్కువ నీరు తాగడం అలవాటు చేసుకోవడం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. దీంతో పాటు ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా రావు. మలబద్దకం నుండి బయటపడటానికి కలబంద రసం, ముడి పసుపు, నువ్వులు, అవిసె గింజలు, నానబెట్టిన చియా విత్తనాలు వంటివి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం లేదా యోగా.. చేయడం వల్ల మలబద్దకాన్ని తగ్గించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: