మీకు కావల్సింది కేవలం ఒక లీటరు ఆవుపాలు.. చిన్న టేబుల్ స్పూన్ పెరుగు..
ఎలా తయారు చేయాలి అంటే.. పాలను ఒక గిన్నెలో పోసి.. స్టౌ మీద పెట్టి వెలిగించి చిన్నటి ఫ్లేమ్ మీద పాలను బాగా చిక్కబడే వరకు మరగనివ్వాలి. పాలు పూర్తిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా చేయాలి. బాగా మరగబెట్టిన పాలను ఒక పాన్ నుంచి మరొక పాన్లో కి మూడు నుంచి నాలుగు సార్లు ఒక దాంట్లో నుంచి మరొక దాంట్లోకి మార్చాలి. ఇలా చేయడం వల్ల పాల నురుగు బాగా వస్తుంది. పాలలో కొద్దిగా పెరుగు వేసి మరో రెండు సార్లు కలపాలి. ఇప్పుడు మట్టి పాత్రలో లేదా మందపాటి గిన్నెలో పోసి ఎనిమిది గంటలపాటు రాత్రిపూట వెచ్చని ప్రదేశంలో ఉంచితే చాలా చక్కటి గడ్డపెరుగు తయారవుతుంది. ఇక వెంటనే ఫ్రిజ్ లో పెట్టవచ్చు. పెరుగు యొక్క నాణ్యత కూడా పాల చిక్కదనం పై ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నీళ్లు కలపకుండా తోడు వేసినప్పుడే చిక్కటి గడ్డ పెరుగు వస్తుంది. మీరు కూడా ఈ చిట్కా పాటిస్తే చక్కటి గడ్డ పెరుగు ఇంట్లోనే తయారు చేయవచ్చు.