పెరుగు తినే అలవాటు ఉన్నవారు ఏది పడితే అలా ఇతర పదార్థాలతో తీసుకోవద్దని సూచిస్తున్నారు వైద్యులు. ఈ పదార్థాలతో పెరుగును కలిపి తింటే తర్వాత ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడే అకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఆరోగ్యాన్ని కొన్ని పదార్థాలు ఎంతో మంచివి. కానీ తినే విధానంలో కొన్ని పద్దతులున్నాయి. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందకు మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడున్న కాలంలో కొత్త కొత్త వైరస్‌లు వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయంలో మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు.పెరుగు, చేపలు ఈ రెండింటిలో ప్రోటీన్లు అధిక మోతాదులో ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల కడుపులో గ్యాస్‌ సమస్య వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అందుకే చేపలతో పెరుగును కలిపి తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.ఇక పెరుగును పాలతో కలిపి తినడం కూడా అంత మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. రెండు తెల్లగానే ఉన్నా.. సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ రెండు కలిపి తినడం వల్ల డయేరియాతో పాటు ఇతర జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు.


అందుకే ఇలా తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.పెరుగును మామిడి పండుతో కలిపి ఎప్పుడు తినకూడదు. అలా కలిపి తినడం వల్ల శరీరంలో అలర్జీ, చర్మ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. వేసవి కాలం వచ్చిందంటే చాలు ఈ రెండు కలిపి తినడం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మామిడి పండు, పెరుగు కలిపి తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఉల్లిపాయలతో కలిపి పెరుగు.. ఉల్లిపాయలతో కలిపి పెరుగు తినడం అంత మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఉల్లి శరీరంలో వేడిని పుట్టిస్తే, పెరుగు చల్లదనానికి కారణమవుతుంది. ఈ రెండు కలిపి తినడం వల్ల సోరియాసిస్‌, దద్దుర్ల వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే లేనిపోని సమస్యలతో ఆస్పత్రుల్లో చేరి ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: