మందారం అనేది కేవలం జుట్టు అందాన్ని మెరుగుపరుచుకోవడానికి మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా చాలా బాగా పని చేస్తుంది.మందార పువ్వులతో చేసిన టీ ని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు కలుగుతుంది. మందార పువ్వుల్లో ఎన్నో రకాలు ఉన్నప్పటికి ఒంటి రెక్క ఎర్ర మందారాల్లోనే ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఆయుర్వేద ఔషధాల్లో ఈ ఎర్ర మందారాలనే చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ఎర్ర మందారాలతో టీ ని ఎలా తయారు చేసుకోవాలి ఇంకా అలాగే ఈ మందార టీ ని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ మందార టీ ని తయారు చేసుకోవడానికి ముందుగా మూడు మందార పువ్వులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఆ తరువాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని బాగా వేడి చేయాలి.ఇక నీళ్లు మరిగిన తరువాత మందార పువ్వుల రేకులను విడదీసి అందులో వేసుకోవాలి. వీటిని మరో రెండు నిమిషాల పాటు అలాగే మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ గిన్నెపై మూతను ఉంచి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ టీ ని వడకట్టుకోని ఒక కప్పులోకి తీసుకోవాలి.


తరువాత ఈటీ లో అర చెక్క నిమ్మరసాన్ని పిండుకొని కలుపుకోవాలి.ఇంకా అలాగే రుచి కొరకు దీనిలో తేనెను  కలుపుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న మందార పువ్వుల టీ ని ప్రతిరోజూ తాగడం వల్ల మనం మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ టీని తాగడం వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు ఈజీగా లభిస్తాయి.ఈ టీ ని తాగడం వల్ల వృద్ధాప్య ఛాయలు కూడా రావు. ఈ మందార టీని తాగడం వల్ల గుండె ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ టీని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రంలో ఉంటాయి. ఇంకా అలాగే అధిక రక్తపోటును తగ్గించడంలో కూడా ఈ మందార టీ మంచి దివ్యౌషధంగా పని చేస్తుంది. ఈ మందార టీ ని తాగడం వల్ల కాలేయం కూడా చాలా బాగా శుభ్రపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మలబద్దకం సమస్య తగ్గడంలో పాటు జీర్ణశక్తి కూడా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: