ఇప్పుడున్న పరిస్థితులలో చాలామంది స్త్రీలు పెళ్లయిన కొన్ని సంవత్సరాలు అయినా పిల్లలు కలగక బాధపడుతూ ఉంటారు. దానికి కారణం పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ, అధికబరువు,ఉబకాయం, హార్మోనల్ ఇమ్బ్యాలెన్స్ వల్ల,వారికి సంతానలేమి ఉంటుంది. అప్పటికి కూడా కొన్ని రకాల వైద్య చికిత్సలను చేయించుకోవడం వల్ల,వారి సమస్యకు పరిష్కారం పొందుతుంటారు.అలా గర్భం వచ్చిన స్త్రీలు మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి.పుట్టబోయే పిల్లల్లో అవయవాలు సక్రమంగా ఏర్పడటానికి గర్భిణీ స్త్రీలకు చాలా అవసరమైన విటమిన్ బయోటిన్. దీనినే b7విటమిన్ అంటారు. ఇది ఒక వాటర్ సాల్యూబుల్ విటమిన్.ఈ బయోటిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, పిల్లలు ఆరోగ్యంగా మరియు తెలివిగా పుడతారు.ఈ బయోటిన్ అధికంగా పొందడానికి గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

గ్రుడ్లు..
గర్భం దాల్చిన మొదటి రోజు నుండి గర్భిణీ స్త్రీలు ఉడికించిన కోడిగుడ్డును రోజుకొకటి తీసుకోవడం వల్ల బయోటిన్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాక రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఎగ్ లోని న్యూట్రియన్స్ ఉపయోగపడతాయి.

 పన్నీర్..
పాల ఉత్పత్తుల్లో ముఖ్యంగా (b7)బయోటిన్ ఎక్కువగా లభిస్తుంది.అంతేకాక ఇందులో కాల్షియం,మెగ్నీషియం అధికంగా ఉంటాయి. కావున స్త్రీలు గర్భం దాల్చిన మొదటి వారం నుంచి, వారానికి రెండు సార్లు పన్నీరు ఇవ్వడం వల్ల, ఇందులోని బయోటిన్ బిడ్డ ఆరోగ్యంగా జన్మించడానికి చాలా బాగా సహాయపడుతుంది.

అవిసె గింజలు..
అవిసె గింజలను తీసుకొని బాగా వేయించి పొడిగా చేసి, వంటల్లోను వేసుకొని తినడం వల్ల  గర్భిణీ స్త్రీలకు కావాల్సిన బయోటిన్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాక పిల్లల మెదడు పెరుగుదలకు కావలసిన పోషకాలాన్ని ఇందులో దొరుకుతాయి.

 అరటిపండు..
కడుపుతో ఉన్న స్త్రీలు బయోటిన్ అధికంగా పొందడానికి రోజుకు ఒక అరటి పండు తినడం చాలా మంచిది. అంతేకాక బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన పొటాషియం,మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి.

 కావున ప్రతి తల్లి తన పుట్టబోయే బిడ్డ సరైన ఆరోగ్యంతో పుట్టడానికి ఈ ఆహారాలను తీసుకోవడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: