మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడూ చెబుతూ ఉంటారు . పెరుగు అన్నం తింటే ఆరోగ్యానికి మంచిది.. పెరుగన్నం తింటే తెల్లగా వస్తారు.. చర్మానికి చాలా మేలు చేస్తుంది.. జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అందుకే కచ్చితంగా అన్నం కొంచమైనా సరే పెరుగు కలుపుకొని తినండి అంటూ పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది అంటూ పెరుగు తినడం ఇష్టం లేని వాళ్ళని కూడా బలవంతంగా పెరుగును తినిపిస్తూ ఉంటారు.  అంతే కాదు పెరుగులో  ప్రోటీన్ .. క్యాల్షియం.. రిబోఫ్లేవీ.. విటమిన్ బ్6 ..విటమిన్ బి12 వంటి అనేక పోషకాలు ఉంటాయి. పెరుగు అన్నం రోజు తినడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది అంటూ డాక్టర్లు కూడా చెబుతున్నారు.  గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉంచడానికి పెరుగు ఎక్కువగా ఉపయోగపడుతుంది . అయితే ఎన్నో మంచి చేసే పెరుగన్నం కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తినకూడదు . అది అస్సలు మంచిది కాదు . అది విషయంగా మారే ప్రమాదం కూడా ఉంది.  అది ఎందుకో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!
 

*పెరుగు చేపలు కలిపి తినకూడదు . ఇది చాలా మందికి తెలిసిందే . కానీ కొన్ని కొన్ని సార్లు చేపల పులుసు తిన్నప్పుడు కారంగా ఉంది అని ఆ కారాన్ని బ్యాలెన్స్ చేసే దాని కోసం పెరుగన్నం తింటూ ఉంటారు . కొంతమంది చేపలను పెరుగులో నానపెట్టి ఫ్రై చేస్తూ ఉంటారు . ఇది వెరీ వెరీ డేంజర్.  వాంతులు అవ్వడం ..మోషన్స్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి.

*అలాగే చాలామంది అరటి పండుని పెరుగన్నంలో కలుపుకొని తింటూ ఉంటారు . అలా తినకూడదు అంటున్నారు డాక్టర్లు . ఈ రెండు కలిపి తినడం వల్ల కడుపునొప్పి వస్తుందట .

*చాలామంది పెరుగు ఉల్లిపాయలను వేసవి రోజుల్లో తినడానికి ఇష్టపడతారు.  ఉల్లిపాయ వేడిగా ఉన్నప్పుడు పెరుగు చల్లగా ఉంటుంది వీటిని కలిపి తినడం వల్ల ఎలర్జీలు గ్యాస్ సమస్యలు వస్తాయట . అందుకే ఈ రెండిటిని కలిపి తినకూడదు అంటున్నారు డాక్టర్లు . పాలు పెరుగు రెండు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  మీరు పాలు తాగితే పెరుగు తినకండి ..పెరుగు తింటే పాలు తాగకండి .. ఈ రెండు కలిపి అస్సలు తీసుకోకూడదు అంటున్నారు డాక్టర్లు .ఇలా పెరుగు పాలు మిక్స్ చేసి తీసుకోవడం వల్ల గ్యాస్ డయేరియా సమస్యలు వస్తాయట.

*చాలామంది దమ్ బిర్యాని కోసం పెరుగులో చికెన్ ని మ్యారినేట్ చేస్తూ ఉంటారు . కానీ అలా చేయకూడదు అంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పెరుగు చికెన్ కలిపి తిననే తినకూడదట . ఇది కడుపు సంబంధిత వ్యాధులకు దారి తీస్తుందట..!

మరింత సమాచారం తెలుసుకోండి: