తెలుగు ఇండస్ట్రీలో ‘ఈ వేళలో నీవూ ఏం చేస్తు ఉన్నావో..’ పాట ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించిన సింగర్ సునిత. తెలుగు దనం ఉట్టిపడేలా చీరకట్టుతో ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్టుగా, సింగర్, యంకర్ గా వ్యవహరిస్తున్న సునిత ఇప్పుడు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనికి కారణం ఈ మద్య ఓ చానల్ లో '' సునీత కూతురు ని చూసారా .... కత్తి లాగా ఉంది '' అనే హెడ్డింగ్ పెట్టి రకరకాల స్టిల్స్ ని పెట్టేసి చేసిన హంగామా చేశారట.
తన కూతురుపై ఇలాంటి చండాలమైన హెడ్డింగ్ పెట్టడం దాన్ని పబ్లిసిటీ చేయడం పై తెగ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది..అదేంటీ అభం..శుభం తెలియని తన కూతురు పై ఇలాంటి నీచమైన హెడ్డింగ్ పెట్టి తమ చానల్ రేటింగ్ పెంచుకోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తుంది. ఇండస్ట్రీలో తనకంటూ ఓ గౌరవం ఉందని ఇలా అమర్యాదగా ప్రవర్తించినందుకు ఆ చానల్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక పోలీస్ కేసు పెట్టాలని కూడా చూసిందట.
కానీ ఇలా చేస్తే ఈ విషయాన్ని మరింత ఫోకస్ చేసి తన కూతరు భవిష్యత్ దెబ్బ తింటుందని భావించి ఆ చానల్ వారికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిందట. సునీతకు ఒక కూతురు , కొడుకు అన్న విషయం తెలిసిందే .