తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు టాప్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లో ఉన్న హీరోయిన్ నయన తార. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ..తర్వాత సూర్ నటించిన ‘గజిని’ చిత్రంలో అందాలు ఆరబోసింది. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో వివాదాలకు కేంద్రబింధువుగా ఉన్న నయనతార మొదట తమిళ హీరో శింబు ప్రేమలో పీకల్లోతుల్లో మునిగిపోయింది. వీరిద్దరి లిప్ లాక్ ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో దుమ్మురేపింది.
శింబుతో ప్రేమాయణం బెడిసి కొట్టిన తర్వాత ప్రముఖ డ్యాన్సర్, దర్శకులు, నటులు అయిన ప్రభుదేవతో ఏకంగా పెళ్లికే రెడీ అయ్యింది. కొద్ది రోజుల తర్వాత వీరి మద్య భేదాభిప్రాయాలతో అది కూడా బెడిసి కొట్టింది. తర్వాత నయన్ పూర్తిగా తన కెరీర్ కే అంకితం అయ్యింది. కాకపోతే శింబు.. ప్రభుదేవాల తరువాత దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో నయనతార ప్రేమలో పడినట్టుగా ఆ మద్య సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేశాయి.
వీటికి తగ్గట్టు నయన్, విఘ్నేశ్ లు కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. అవార్డుల ఫంక్షన్కి వెళ్లినా వీళ్లిద్దరు జంటగా కనిపించడంతో మ్యారేజ్ చేసుకోవడం ఖాయమని ప్రచారం సాగింది.. సాగుతూనే వుంది. గతేడాది ఓనమ్ ఫెస్టివల్కి విఘ్నేష్ని కేరళ తీసుకుని ఫ్యామిలీ సభ్యులకు ఇంట్రడ్యూస్ చేసింది నయనతార.
తాజాగా డైరెక్టర్ విఘ్నేష్ తన బర్త్డే సందర్భంగా నయనతారతో కలిసి న్యూయార్క్కి చెక్కేశాడు. ఎప్పుడూ మలేషియా, సింగపూర్ ప్రాంతాలను ఎంపిక చేసుకునే ఈ జంట, ఈసారి అమెరికాని ఎంచుకుంది. వీళ్లిద్దరు కలిసి న్యూయార్క్ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. చూడబోతే త్వరలోనే పెళ్లి కబురు చెప్పేలా వున్నారనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. ఈ ఇద్దరి లేటెస్ట్ ఫోటో మాత్రం ఇప్పుడు ఆన్లైన్లో వైరల్గా మారింది.