టాలీవుడ్ లో మొదట సినిమాల్లో అక్కడక్కడా చిన్న చిన్న పాత్రల్లో నటించి మంచి పేరు గడించిన అడివి శేష్, ఇటీవల పివిపి బ్యానర్ లో వచ్చిన క్షణం సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత అయన నటించిన గూఢచారి సినిమా కూడా హిట్ అవడంతో అందరి కళ్ళు శేష్ మీద పడ్డాయి. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, తన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న మేజర్, అలానే గూఢచారి 2 సినిమాల్లో హీరోగా నటిస్తున్న శేష్, వాటితో పటు మరొక సస్పెన్స్ థ్రిల్లర్ ఎవరు లో కూడా నటిస్తున్నాడు. 

మరొక్కసారి పివిపి బ్యానర్ లో నూతన దర్శకుడు వెంకట్ రాంజీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలోని కొన్ని సీన్స్ యూనిట్ సబ్యులకు కూడా చెప్పకుండా ఎంతో రహస్యంగా తీయడం జరిగిందని, దానికి కారణం సినిమాలోని కొన్ని కీలక ట్విస్టులు రివీల్ అవుతాయని భావించి ఆ విధంగా చిత్రీకరించామని ఇటీవల హీరో అడివి శేష్ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియపరిచారు. శేష్ సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర, మురళి శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ 'ఎవరు' సినిమా ఆద్యంతం ఎంతో సస్పెన్స్ తో సాగుతూ క్షణ క్షణం థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడికి రోమాలు నిక్కపొడుచుకునేలా, తరువాత సీన్లో ఏమి జరుగుతుందో ఏ మాత్రం ఊహించలేని విధంగా సాగుతుందని, 

ఆ విధంగా సినిమాని చిత్రీకరించడం కోసం తమ యూనిట్ మొత్తం ఎంతో కష్టపడుతున్నాం అని శేష్ అంటున్నారు. రేపు సినిమా విడుదల తరువాత దర్శకుడు సహా సినిమా యూనిట్ మొత్తాన్ని ప్రేక్షకులు ఎంతో మెచ్చుకుంటారని అయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తుండగా, అబ్బూరి రవి మాటలు సమకూరుస్తున్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగష్టు 23న థియేటర్స్ లోకి వస్తుందని ఇటీవల ప్రకటించింది సినిమా యూనిట్....!!


మరింత సమాచారం తెలుసుకోండి: