తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన హీరోయిన్ గా నటించిన కృతి సనన్ గుర్తుందిగా. ఈ అమ్మడు మహేశ్ పక్కన 2014లో వన్.. నేనొక్కడినే సినిమాలో నటించింది. గ్లామర్ పరంగా ఆ సినిమాలో ఆకట్టుకున్న కృతి సనన్ కు ఆ సినిమా చేదు ఫలితాన్నిచ్చింది. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నా కమర్షియల్ గా హిట్ కాలేదు. దీంతో తొలి సినిమాకే మిశ్రమ ఫలితం రావడంతో తెలుగులో అవకాశాలు కూడా తగ్గాయి.

ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ అమ్మడికి మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చింది. తొలి సినిమానే సౌత్ లో అదీ సూపర్ స్టార్ పక్కన. బాలీవుడ్ అడపాదడపా సినిమాలు చేస్తూనే మోడలింగ్ కూడా చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను దగ్గరగా ఉంటుంది. తాజాగా అమ్మడు ఫిల్మ్ ఫేర్ పత్రిక కోసం చేసిన ఫోటో షూట్ అభిమానులకు కిక్కిస్తోంది. పసుపు రంగు డ్రెస్ లో, నాభి అందాలతో పిచ్చెక్కిస్తోంది. సెక్సీ లుక్ లో ఉన్న కృతి ఈ పత్రిక కవర్ పేజీ ఫోజు హైలైట్ గా నిలిచింది. సినిమాలు, మోడలింగ్ తో బిజీగా ఉంటుంది. ఎమ్ఎస్ టేకెన్ అనే వెస్ట్రన్ వేర్ కు స్టైలిష్ ప్రమోటర్ గా ఉంటోంది కృతి.

మహేశ్ వన్ నేనొక్కడినే తర్వాత నాగ చైతన్యతో దోచెయ్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా యావరేజ్ కావడంతో ఇక్కడ గేట్లు మూసుకుపోయాయి. బాలీవుడ్ కృతి చేసిన బరేలీకి బర్ఫీ, లుకా చుప్పీ వంటి సినిమాల్లో చేసింది. ప్రస్తుతం హౌస్ ఫుల్ 4 సిరీస్, పానిపట్ లో నటిస్తోంది. పారాచ్యూట్, టైటన్ వాచెస్, ట్రిడెంట్ గ్రూప్ యాడ్స్ నటిస్తూ కెరీర్ కొనసాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: