అదేంటి మొన్ననే కదా ఆమె బుట్ట బొమ్మ సాంగ్ కు డ్యాన్స్ వేసింది.. అప్పుడే తల్లి ఎలా అయ్యింది అని ఆలోచనలో పడ్డారు అభిమానులు. అవును కదా.. మొన్ననే కదా బొట్టా బొమ్మ సాంగ్ కు డ్యాన్స్ వేసింది. రోజుల వ్యవదిలోనే తల్లి ఎలా అయ్యింది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.. నిజానికి రాసేవారు కూడా మొదట అలాగే ఆలోచించారు.. కానీ ఆమె తల్లి అవ్వటానికి అసలు కథ వేరు.. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే..  బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి రెండొవసారి తల్లి అయ్యింది.. వారికీ పండంటి ఆడబిడ్డ జన్మించినట్టు శిల్పాశెట్టి అభిమానులకు చెప్పింది. అయితే పాప పుట్టిన సందర్భంగా శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ఇంస్టాగ్రామ్ లో ఓ సంచలన పోస్ట్ పెట్టాడు. అది ఏం అని అంటే? 

 

''ఇన్నాళ్ల మా ప్రార్థనలకు ప్రతికాగా ఓ అద్భుతం జరిగింది. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. జూనియర్‌ ఎస్‌ఎస్‌కే వచ్చేసింది. చిట్టితల్లి మా జీవితాల్లోకి రావడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. సమీశా శెట్టి కుంద్రా.. ఫిబ్రవరి 15న జన్మించింది. స అంటే సంస్కృతంలో కలిగి ఉండటం అని అర్థం. మిశ అంటే రష్యన్‌ భాషలో దేవత. మా ఇంటి లక్ష్మి.. మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసింది. మా ఏంజెల్‌కు మీ ఆశీర్వాదాలు కావాలి. తల్లిదండ్రులు: రాజ్- శిల్పాశెట్టి కుంద్రా. అన్నయ్య వియాన్‌‌'' అంటూ నిన్న ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. 

 

దీంతో ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరాల్ అయ్యింది.. శిల్పా శెట్టి మరోసారి తల్లి అయ్యింది అని తెలిసింది. అయితే ఇలా అవ్వడంతో అభిమానులలో చిన్నపాటి అనుమానం కలిగింది.. మొన్నే కదా బుట్ట బొమ్మకు స్టెప్ లు వేసింది.. ఆలా ఎలా ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చింది అని. ఆ బిడ్డకు సరోగసి ద్వారా జన్మనిచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న కొందరు నెటిజన్లు.. సరోగసి ద్వారా జన్మనిచ్చిన బిడ్డకు నువ్వు ఇంత పోస్ట్ పెట్టాలా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

I can’t express how happy @theshilpashetty and I are to announce the newest member of our family Samisha Shetty Kundra 🙏🙏🙏 blessed with a baby girl #gratitude

A post shared by raj Kundra (@rajkundra9) on

మరింత సమాచారం తెలుసుకోండి: