పవన్ కళ్యాణ్ వీరాభిమాని, బీజేపీ నాయకురాలు మాధవి లత ఏదోక వార్తతో సంచలనంగా మారుతుంది.అందుకే ఈ మధ్య సినిమాల లో కనిపించడం కన్నా ఎక్కువగా బయట ఈ అమ్మడు పేరు మారు మ్రోగి పోతుంది.ఎవరోకరి మీద ట్రోల్స్ వేసే ఈ బ్యూటీ ఈసారి ఏకంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసింది.ప్రస్తుతం ఆ విషయం పవన్ అభిమానుల చర్చకు దారి తీసింది.


వివరాల్లోకి వెళితే.. పవన్ బర్త్ డే సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాలను డెడికేట్ చేస్తూ పోస్టర్స్ విడుదల చేసింది. ‘మా నాయకుడు ఓట్లు అడగమని చెప్పాడు.. కొనమని కాదు’ అంటూ ఆమె నటిస్తున్న ‘సత్యగ్రహి’ సినిమా పోస్టర్‌ను విడుదల చేస్తూ పవన్‌కి విషెష్ అందించింది. అలాగే.. ‘లేడీ’ సినిమా పోస్టర్‌ని కూడా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసింది.ఒక లేఖ రూపంలో ఉన్న ఆ పోస్ట్ ప్రస్తుతం అందరి నోట్లో నానడం తో పాటుగా సోషల్ మీడియాలో కూడా చకర్లు కొడుతుంది.


నిజమైన అభిమానులను అర్థం చేసుకోవాలి.. మీకోసం నేను చాలా కష్టపడ్డాను..నా పై ఇసుమంత కూడా అభిమానాన్ని మీరు చూపించలేదు. ఎవరోరేవరికో మీ ప్రేమను పంచుతారు..అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.ఈ విషయాన్ని ప్రముఖ ఛానెల్ లో పదే పదే ప్రసారం చేస్తూ హైలెట్ చేశారు. విషయం పై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించాడు.ఆ ఛానెల్ కు తనదైన స్టయిల్లో ఒక లేఖను రాశారు.మనుషుల విలువలను జర్నలిస్టులు కాపాడాలి అంటూ పవన్ లేఖలో పేర్కొన్నారు.అంతేకాదు మీ ఛానెల్ మీద గౌరవం ఉంది..మీరు జర్నలిజం విలువలను,ప్రజల సామరస్యాన్ని కాపాడే విధంగా బాధ్యత గా పనిచేస్తారని మా పార్టీ కోరుకుంటుంది..మీ ప్రసారాలపై అసంతృప్తిని వ్యక్తం చేసే పరిస్థితిని మరోసారి తీసుకురాకుండా ఉంటారని కోరుకుంటున్నాము అంటూ పవన్ అన్నారు.దీనిపై స్పందించిన పవన్ అభిమానులు గట్టిగా కొట్టారని కామెంట్లు పెడుతూ సోషల్ మీడియా లో రచ్చ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: