సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసు రోజురోజుకు మరింత తీవ్ర రూపం దాల్చుతుంది.సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య యావత్ భారతదేశాన్నే షాక్ కి గురి చేసిన సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించగా కుటుంబ సభ్యులు ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. సుశాంత్ మృతికి హీరోయిన్ రియా చక్రవర్తి కారణం అని వారు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సీబీఐకి అప్పగించడం జరిగింది. అయితే ఇందుకు ప్రధాన కారణమైన అతని ప్రేయసి రియా చక్రవర్తి పై ప్రస్తుతం సిబిఐ గట్టిగానే విచారణ చేస్తుంది. రియా చక్రవర్తి అరెస్టుపై బాలీవుడ్ రెండు వర్గాలుగా చీలింది. ‘అది రియా రాసుకున్న కర్మ’ అని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే కామెంట్ చేసింది. మరికొంతమందికి ఆమె అరెస్టు సంతోషాన్ని కలిగించిందని చెప్పుకోవాలి.సోషల్ మీడియాలో వాళ్ళ కామెంట్లు , పోస్టులు చూస్తే ఆ విషయం తెలుస్తుంది. రియా చక్రవర్తికి కొంతమంది మద్దతుగా మాట్లాడారు. “సుశాంత్ ఆత్మహత్య కేసులో రియాను అరెస్ట్ చేయలేదని సంబరాలు చేసుకుంటున్నవాళ్ళు గ్రహించాలి. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చెయ్యలేదు.
సుశాంత్ జీవించి ఉంటే అదే కేసులో అరెస్ట్ అయ్యేవాడు” అని తాప్సి సహా కొందరు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అయితే, రియా చక్రవర్తి అరెస్టు ద్రౌపది వస్త్రాపహరణంతో ‘కొత్త బంగారు లోకం’ హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ పోల్చింది. ‘మహాభారతం’లో నిండుమహాసభలో ద్రౌపదికి ఎటువంటి అవమానం జరిగిందో, నేటి భారతంలో రియా చక్రవర్తికి అటువంటి అవమానం జరిగిందనేది శ్వేతాబసు ప్రసాద్ అంటున్నది. ద్రౌపది వస్త్రాపహరణం ఇంకా కొనసాగుతున్నదని చెబుతున్నది. ఇది సిగ్గు అని ఆమె అన్నది.

హోలీ రోజున బాంగ్ సప్లై చేసేవాళ్ళను కూడా అరెస్ట్ చెయ్యాలని శ్వేతాబసు ప్రసాద్ డిమాండ్ చేసింది. రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన కేసులో ముంబైలో ప్రజలను అరెస్ట్ చెయ్యడం మొదలుపెడితే సగం సిటీ ఖాళీ అవుతుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా స్పందించడం గమనార్హం. ముంబైలో గంజాయి గట్రా తీసుకోవడం కామన్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: