ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి కుమారి 21ఎఫ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న యువ హీరో రాజ్ తరుణ్ లేటెస్ట్ గా తను చేసిన ఒరెయ్ బుజ్జి సినిమా ఓటిటి రిలీజ్ ప్లాన్ చేశారు. అక్టోబర్ 2న రాజ్ తరుణ్ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజ్ తరుణ్ తాను వెబ్ సీరీస్ లు చేసేందుకు కూడా సిద్ధమే అని అంటున్నాడు. వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ ద్వార ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుందని.. తనని ఇంతవరకు వెబ్ సీరీస్ ల కోసం ఎవరు సంప్రదించలేదని అంటున్నాడు రాజ్ తరుణ్.  

ఛాన్స్ వస్తే తప్పకుండా వెబ్ సీరీస్ లో నటిస్తా అంటున్నాడు. అంతేకాదు కుదురితే తనకు నెగటివ్ టచ్ ఉన్న పాత్రలు చేయాలని ఉందని చెప్పాడు. తనలో విలన్ ఉన్నాడని వాడిని వాడుకుంటే బాగుంటుందని మేకర్స్ కు సలహా ఇస్తున్నాడు రాజ్ తరుణ్. విలన్ గా అంటే 10 మందిని కొడితే గాల్లో ఎగిరే విలన్ గా కాదు.. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా తాను చేయడానికి సిద్ధమే అంటున్నాడు రాజ్ తరుణ్.

ఎలాగు హీరోగా పెద్దగా అవకాశాలు లేని రాజ్ తరుణ్ తన పంథా మార్చాలని అనుకుంటున్నాడు. అందుకే ఇలా వెబ్ సీరీస్, విలనిజం అంటూ చెబుతున్నాడు. ఒరేయ్ బుజ్జి సినిమా హిట్టైతే పర్లేదు ఒకవేళ ఆ సినిమా తేడా కొడితే మాత్రం మళ్ళీ అతనికి మరో ఛాన్స్ కూడా వచ్చే అవకాశం లేదు. విజయ్ కుమార్ కొండా డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మాళవిక నాయర్, హెబ్భా పటేల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.                           

మరింత సమాచారం తెలుసుకోండి: